బుధవారం, 16 ఏప్రియల్ 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 15 ఏప్రియల్ 2025 (18:03 IST)

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

kidney stones
చాలా మందిలో కిడ్నీలో రాళ్లు చేరుతుంటాయి. ఈ రాళ్ళను తొలగించుకునేందుకు వివిధ రకాలైన వైద్యం చేయించుకునేందుకు ఆస్పత్రుల చుట్టూ తిరుగుతుంటారు. అస్సలు కిడ్నీలో రాళ్లు ఎలా చేరుతాయన్న సందేహం ప్రతి ఒక్కరిలో ఉంటుంది. దీనిపై ఉన్న సందేహాన్ని నివృత్తి చేసుకుందాం.
 
మానవ మూత్రంలో ఖనిజాలు, ఆమ్లాలు, ఇతర పదార్థాలన్నీ కలిసి వుంటాయి. ఇందులో కాల్షియం, సోడియం, ఆక్సలైట్, యూరిక్ యాసిడ్‌లు ఉంటాయి. మనం నీళ్లు తాగినపుడు అవి శరీరం నుంచి మూత్రం రూపంలో బయటకు వెళ్తాయి అని శాస్త్రవేత్తలు వివరించారు. 
 
మనం తక్కువ నీరు తాగడం వల్ల కాల్షియం, సోడియం, ఆక్సలేట్, యూరిక్ యాసిడ్ వంటి పదార్థ కణాల మోతాదు మూత్రంలో పెరిగిపోతుంది. తగినంత ద్రవం లేకపోవడం వల్ల ఆ కణాలన్నీ కలిసి అతుక్కోవడం ప్రారంభిస్తాయి. ఇలా అతుక్కున్న కణ భాగాలే కిడ్నీలలో రాళ్లుగా ఏర్పడతాయి. 
 
మరోవైపు, కిడ్నీల్లో రాళ్లు ఉండటంపై ఢిల్లీ ఎయిమ్స్ పరిశోధకుల జరిపిన అధ్యయనంలో ప్రతి 10 మందిలో ఒకరు తమ జీవితకాలంలో మూత్రపిండాల్లో రాళ్ల సమస్యను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఈ సమస్యకు 30 నుంచి 40 ఏళ్లలోపు వారిలో సర్వసాధరణంగా ఉండొచ్చు. 
 
మూత్రపిండాల్లో రాళ్లు వస్తే నడుమ దిగువభాగంలో, ఉదరంలో లేదా ఉదరంలోని ఒక వైపున నొప్పిన అనిపిస్తుంది. ఈ నొప్పి నడుమ నుంచి చంకల వరకు వ్యాపించినట్టు అనిపిస్తుంది. ఈ నొప్పి కొన్నిసార్లు తేలిగ్గా, మరికొన్ని సార్లు మధ్యస్తంగా, ఇంకొన్నిసార్లు తీవ్రంగా ఉంటుంది.