మళ్లీ రిపీట్ కానున్న ఫిదా కాంబో.. వరుణ్ తేజ్.. సాయిపల్లవి..?

మంగళవారం, 18 మే 2021 (12:31 IST)
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, సాయి పల్లవి ప్రధాన పాత్రలలో శేఖర్ కమ్ముల తెరకెక్కించిన చిత్రం ఫిదా. ఈ చిత్రం ప్రేక్షకులని ఎంత ఫిదా చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా వరుణ్‌, సాయి పల్లవి మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకులకి బాగా నచ్చింది. ఇప్పుడు వీరిద్దరు మరోసారి జంటగా అలరించేందుకు సన్నద్దమైనట్టు తెలుస్తుంది. 
 
ప్రస్తుతం వరుణ్ తేజ్ ఎఫ్‌3, గని చిత్రాలతో బిజీగా ఉండగా, ఈ రెండు పూర్తయ్యాక 'ఛలో, భీష్మ' సినిమాలతో హిట్‌ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న వెంకీ కుడుములతో ఓ మూవీ చేయనున్నట్టు సమాచారం.
 
ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తైందని, వీలైనంత తొందరగానే మూవీని సెట్స్ పైకి తీసుకెళ్లాలని మేకర్స్ ఆలోచిస్తున్నారట. అయితే ఈ సినిమాకి సంబంధించి మరో ఇంట్రెస్టింగ్‌ న్యూస్‌ ఇప్పుడు వైరలవుతోంది. 
 
ఈ చిత్రంలో వరుణ్ తేజ్ సరసన ఫిదా ఫేం సాయిపల్లవిని ఎంపిక చేసారని, మరోసారి ఈ జంట తెరపై ఫుల్ ఫన్ క్రియేట్ చేయనున్నారని అంటున్నారు. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్‌ నిర్మించనున్నట్లు సమాచారం.

అన్నీ చూడండి

బరాకా అణు విద్యుత్ కేంద్రంపై డ్రోన్ దాడి : ఇరాన్ చర్యేనా?

ఆరు నెలల్లో టీవీకే ప్రభుత్వం కుప్పకూలిపోతుంది : డీఎంకే ఎమ్మెల్యే జోస్యం

Nara Devansh: జెన్ జెడ్ కంటెంట్‌ క్రియేటర్‌గా నారా దేవాన్ష్.. వెల్లువెత్తుతున్న ప్రశంసలు (video)

బండి సంజయ్‌ కుమారుడికి పదేళ్లు జైలుశిక్ష పడేలా అదనపు సెక్షన్లు

గోవులను ఎక్కడకు తరలిస్తున్నారు... బర్త్ సర్టిఫికేట్ ఉందా? బీజేపీ ఎమ్మెల్యే ప్రశ్న

అన్నీ చూడండి

మామిడి పండ్లు తింటున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

బ్యాడ్ కొలెస్ట్రాల్ వుందా, ఇలా వదిలించుకోవచ్చు

మీ చాయ్‌: ఆంధ్రప్రదేశ్‌లో టీ కల్తీపై అవగాహన కల్పిస్తోన్న టాటా టీ చక్ర గోల్డ్ జెమిని

వాతావరణ మార్పులు, ప్రజల నేత్ర ఆరోగ్యం: తలెత్తుతున్న ఆందోళనలు

మితిమీరి గోధుమ రోటీలను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments