'ఐరెన్ లెగ్ శాస్త్రి' భార్య వంట మనిషి పని... ఆదుకుంటామన్న ''మా'' రాజేంద్రప్రసాద్
'మా' అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ కళాకారులకు ఏదో ఒకటి చేస్తాడని పేరు తెచ్చేసుకున్నారు. తాను అధ్యక్షుడిగా అయ్యాక... వృద్ధ కళాకారులకు ఫించన్లు ఇవ్వడం ప్రారంభించారు. ఈ విషయంలో గత అధ్యక్షుడికన్నా మంచి పేరుతెచ్చుకోగా... మరో కార్యక్రమం రూపుదాల్చాడు. సమగ్రసర్వే రూపేణా.. పేద కళాకారులను లిస్ట్ చేసి అవసరమైనవారిని దత్తత తీసుకునే కార్యక్రమం చేపట్టనున్నాడు.
ఆ కోవలో తాజాగా... అంటే మంగళవారం నాడు ఐరన్లెగ్ శాస్త్రి కుటుంబం కష్టాలను టీవీలో ప్రసారం చేసిన విషయాన్ని ఆయన దృష్టికి తెచ్చారు. గోదావరి జిల్లాకు చెందిన ఆయన చనిపోయాక, ఆయన కుటుంబం కష్టాలపాలైంది. దేవాయంలో వంట చేసే పనికి ఆయన భార్య వెళుతున్నారు. పిల్లల్ని చదివించుకోలేని స్థితిలో వున్నారని తెలుసుకున్న నటులు సంపూర్ణేష్ బాబు, సందీప్ కిషన్ స్పందించి తమ సాయంగా రూ.25 వేలు ఇస్తున్నట్లు ప్రకటించారు.
ఈ విషయం మంగళశారం మధ్యాహ్నం.. రాజేంద్రప్రసాద్ దృష్టికి కొందరు తీసుకువస్తే... తను 'మా' సభ్యుడైతే తప్పకుండా సాయం అందిస్తాం. లేదంటే అందుకు తగినవిధంగా వేరే మార్గం ఆలోచిస్తామని.. ఏదిఏమైనా ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని పేర్కొనడం విశేషం.