'కేజీఎఫ్ చాప్టర్ 2' అదుర్స్.. బాహుబలి రికార్డు బ్రేక్..

గురువారం, 14 ఏప్రియల్ 2022 (11:28 IST)
'కేజీఎఫ్ చాప్టర్ 2'ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. భారీ అంచనాలతో రూపొందిన ఈ చిత్రం తాజాగా ఓ అరుదైన ఘనతను అందుకుంది. ఈ క్రమంలోనే బాహుబలి 2, ఆర్ఆర్ఆర్ రికార్డులను సైతం బద్దలు కొట్టేసి.. దేశంలోనే నెంబర్ వన్ మూవీగా నిలిచింది. 
 
కేజీఎఫ్ చాప్టర్ 1 వంటి సక్సెస్‌ఫుల్ మూవీ తర్వాత రాకింగ్ స్టార్ యశ్, ప్రశాంత్ నీల్ కలిసి చేసిన చిత్రమే'కేజీఎఫ్ చాప్టర్ 2'. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ చిత్రాన్ని హొంబళే ఫిల్మ్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మించింది. ఇందులో విలన్ అధీరాగా సంజయ్ దత్ నటించారు. శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా చేసింది. రవి బస్రూర్ ఈ సినిమాకు సంగీతాన్ని సమకూర్చాడు. 
 
ఈ సినిమా ఏప్రిల్ 14న ఎంతో గ్రాండ్‌గా విడుదల చేశారు. చాలా ప్రాంతాల్లో ముందుగానే అడ్వాన్స్ బుకింగ్స్‌ను మొదలు పెట్టగా.. గంటల వ్యవధిలోనే టికెట్లన్నీ అమ్ముడు అయిపోయాయి. తెలుగులోనూ దాదాపు ఇదే పరిస్థితి కనిపించింది.
 
తెలుగులో తెరకెక్కినా దేశ వ్యాప్తంగా హవాను చూపించిన బాహుబలి మూవీ కూడా అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా భారీ కలెక్షన్లను రాబట్టింది. ఈ చిత్రం ఏకంగా రూ. 80 కోట్లు వసూలు చేసింది. 
 
అలాగే, ఆర్ఆర్ఆర్ రూ. 58 కోట్లు రాబట్టింది. ఇప్పుడు ఈ సినిమాలను దాటేసిన  కేజీఎఫ్ చాప్టర్ 2' రూ. 80.30 కోట్లతో ఇండియాలో నెంబర్ వన్ మూవీగా చరిత్ర సృష్టించింది.

అన్నీ చూడండి

మైనర్ బాలికను పార్కుకు తీసుకెళ్లి అత్యాచారం చేసిన కామాంధుడు...

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను పరామర్శించిన రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్

ముద్రగడకు ప్రభుత్వ లాంఛనాలను అడ్డుకోవడం దుర్మార్గపు చర్య : జ్యోతుల నెహ్రూ

co-living తంటా, ప్రియుడి ఇంటికి వెళ్లిన యువతి, పెళ్లి చేసేసిన పెద్దలు

విఫలమైన ప్రేమ ... ఉరేసుకున్న యువతి ... మృతదేహానికి తాళి కట్టాలంటూ డిమాండ్

అన్నీ చూడండి

ఈ ఆహారంతో బ్లడ్ క్లాట్స్

హైదరాబాద్‌లో అత్యాధునిక ఐసీయూ ఏర్పాటుకు మెడ్‌ట్రానిక్, అపోలో హాస్పిటల్స్ భాగస్వామ్యం

బరువు నిర్వహణ కోసం సోహా అలీ ఖాన్ తెలివైన ఆహార ఎంపికలు, ఏంటవి?

పరగడుపున మంచినీరు తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments