'కేజీఎఫ్ చాప్టర్ 2' అదుర్స్.. బాహుబలి రికార్డు బ్రేక్..

గురువారం, 14 ఏప్రియల్ 2022 (11:28 IST)
'కేజీఎఫ్ చాప్టర్ 2'ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. భారీ అంచనాలతో రూపొందిన ఈ చిత్రం తాజాగా ఓ అరుదైన ఘనతను అందుకుంది. ఈ క్రమంలోనే బాహుబలి 2, ఆర్ఆర్ఆర్ రికార్డులను సైతం బద్దలు కొట్టేసి.. దేశంలోనే నెంబర్ వన్ మూవీగా నిలిచింది. 
 
కేజీఎఫ్ చాప్టర్ 1 వంటి సక్సెస్‌ఫుల్ మూవీ తర్వాత రాకింగ్ స్టార్ యశ్, ప్రశాంత్ నీల్ కలిసి చేసిన చిత్రమే'కేజీఎఫ్ చాప్టర్ 2'. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ చిత్రాన్ని హొంబళే ఫిల్మ్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మించింది. ఇందులో విలన్ అధీరాగా సంజయ్ దత్ నటించారు. శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా చేసింది. రవి బస్రూర్ ఈ సినిమాకు సంగీతాన్ని సమకూర్చాడు. 
 
ఈ సినిమా ఏప్రిల్ 14న ఎంతో గ్రాండ్‌గా విడుదల చేశారు. చాలా ప్రాంతాల్లో ముందుగానే అడ్వాన్స్ బుకింగ్స్‌ను మొదలు పెట్టగా.. గంటల వ్యవధిలోనే టికెట్లన్నీ అమ్ముడు అయిపోయాయి. తెలుగులోనూ దాదాపు ఇదే పరిస్థితి కనిపించింది.
 
తెలుగులో తెరకెక్కినా దేశ వ్యాప్తంగా హవాను చూపించిన బాహుబలి మూవీ కూడా అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా భారీ కలెక్షన్లను రాబట్టింది. ఈ చిత్రం ఏకంగా రూ. 80 కోట్లు వసూలు చేసింది. 
 
అలాగే, ఆర్ఆర్ఆర్ రూ. 58 కోట్లు రాబట్టింది. ఇప్పుడు ఈ సినిమాలను దాటేసిన  కేజీఎఫ్ చాప్టర్ 2' రూ. 80.30 కోట్లతో ఇండియాలో నెంబర్ వన్ మూవీగా చరిత్ర సృష్టించింది.

అన్నీ చూడండి

నలుగురైదుగురు భార్యలని మాట్లాడి ఓ పార్టీ భూస్థాపితం, ఇదేనా జర్నలిజం: తెలంగాణ జనసేన

అమిత్ షా గారూ, ఆయన్ని అరెస్ట్ చేయరా: డిప్యూటీ సీఎం పవన్ డైలాగ్‌తో పగలబడి నవ్విన జనసైనికులు, వీడియో

Vijay : ఢిల్లీలో ప్రధానిని కలిసిన తమిళనాడు సీఎం విజయ్

రాగి శాసనాలను స్వదేశానికి తెప్పించిన ప్రధాని మోడీ.. ప్రశంసించిన సీఎం విజయ్

మమతా బెనర్జీకి షాకిచ్చిన బరాసత్ ఎంపీ... అన్ని పదవులకు రిజైన్

అన్నీ చూడండి

శస్త్రచికిత్స లేకుండానే 4 ఏళ్ల చిన్నారి గుండెలో రంధ్రాన్ని విజయవంతంగా మూసిన మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు

మంచినీటిలో నానబెట్టి తినాల్సిన ఆహారాలు ఏమిటి?

తీపి పదార్థాలను మోతాదుకి మించి తింటే ఏమవుతుందో తెలుసా?

మండుటెండలో నుంచి చల్లటి నీరు తాగితే...

నువ్వుల నూనెతో ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments