Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏది బూతు? ఏది కామెడీ? అనేది వాళ్లే నిర్ధారించాలి: నాగబాబు

జబర్దస్త్ కార్యక్రమంలో హైపర్ ఆది అనాథలపై చేసిన వివాదాస్పదమైన నేపథ్యంలో ఓ మీడియా అడిగిన ప్రశ్నకు సినీ నటుడు నాగబాబు స్పందించారు. ఓ చర్చా కార్యక్రమంలో నాగబాబు మీడియాపై ఫైర్ అయ్యారు. ఈ వివాదంపై జబర్దస్త్

Written By selvi
Updated: ఆదివారం, 26 నవంబరు 2017 (15:07 IST)
జబర్దస్త్ కార్యక్రమంలో హైపర్ ఆది అనాథలపై చేసిన వివాదాస్పదమైన నేపథ్యంలో ఓ మీడియా అడిగిన ప్రశ్నకు సినీ నటుడు నాగబాబు స్పందించారు. ఓ చర్చా కార్యక్రమంలో నాగబాబు మీడియాపై ఫైర్ అయ్యారు. ఈ వివాదంపై జబర్దస్త్ నటుడు హైపర్ ఆదితో మాట్లాడేందుకు మీడియా ప్రయత్నించింది. అయితే ఆది దొరక్కపోవడంతో.. జబర్దస్త్ కార్యక్రమానికి జడ్జిగా వ్యవహరిస్తున్న నాగబాబుతో మాట్లాడేందుకు యాంకర్ ప్రయత్నించారు. కానీ నాగబాబు లైవ్‌లో మాట్లాడేందుకు నిరాకరించారు. 
 
మీడియా, మేధా సంఘాలు, మహిళా సంఘాలన్నీ ఏం ఉద్ధరిస్తాయంటూ ప్రశ్నించారు. వీరికి స్పందించాల్సిన అవసరం లేదని.. ఏది బూతు? ఏది కామెడీ? అనే విషయాన్ని నిర్ధారించాల్సింది ప్రేక్షకులు మాత్రమేనని నాగబాబు తెలిపారు. కానీ ఇదంతా లైవ్‌లో జరగలేదని.. ఫోన్ ఇన్ తీసుకునేందుకు మీడియా ప్రయత్నించినప్పుడు జరిగిన విషయమని సదరు టీవీ యాంకర్ లైవ్ షోలో వివరించి చెప్పారు.
 
హైపర్ ఆది స్కిట్‌లో భాగంగా ఇంతకీ అనాథలు అంటే అతిగా ఆవేశపడే ఆడదానికి.. అతిగా ఆశపడే మగాడికి కలిగే సంతానమే అనాథలు అంటారని తనదైన శైలిలో బూతు కామెడీకి తెరతీస్తూ దారుణమైన వ్యాఖ్యలు చేశారు. దీంతో అనాథలు అంటే సంఘంలో ఓ గౌరవం ఉందని మమ్మల్ని కించపరచడమే కాకుండా మా గౌరవానికి భంగం కలిగేలా స్కిట్ చేసిన జబర్దస్త్ కామెడీ షోపైన హైపర్ ఆదిపైన చర్యలు తీసుకోవాలంటే అనాథ యువతులు సైఫాబాద్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు.

అన్నీ చూడండి

జిమ్‌లో వ్యాయామం చేస్తూ గుండెపోటుతో డాక్టర్ మృతి, అతి వ్యాయామమే కారణమా?, వీడియో

నేపాల్ భోటేకోశి వరద భారతదేశం గండకీ నదికి చేరింది, కొట్టుకు వచ్చిన 3 మృతదేహాలు

రోడ్డుపై సీఐ హల్చల్... కాలర్ పట్టుకుని ఈడ్చెకెళ్లారు (వీడియో)

ఉద్యోగం కోల్పోయి డిష్‌వాషింగ్ పనిలో చేరిన 29 యేళ్ల వ్యక్తి... డబ్బు కోసం కాదట...

ఓయ్ బాబూ.. వీళ్లు నన్ను చంపేస్తారు, ప్లీజ్ ఇక్కడ్నుంచి తీసుకెళ్లు: గర్భిణి అన్నట్లుగానే చంపేసారు, వీడియో

అన్నీ చూడండి

మహిళలు - చిన్నపిల్లల కోసం ప్రత్యేకంగా మా కావేరీ స్పెషాలిటీ ఆస్పత్రి

మధుమేహం వున్నవారు పిస్తా పప్పులు తినవచ్చా?

చెన్నై కుమరన్ ఆస్పత్రిలో 20 గంటల మారథాన్ ఆపరేషన్ విజయవంతం

ప్రతిరోజూ 10 బాదం పప్పులు తిని చూడండి

ఎంజీఎం కేన్సర్ ఇనిస్టిట్యూట్‌లో బ్రెస్ట్ కేన్సర్‌‍కు అధునాతన చికిత్స

తర్వాతి కథనం
Show comments