మంగళవారం, 15 అక్టోబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 15 అక్టోబరు 2024 (14:51 IST)

రాజకీయం అంతా చెత్తతో నిండిపోయింది-నానా పటేకర్

రైతు తినేది దొంగ సొమ్మా? నేతలు తినేది కష్టార్జితమా? ఇదేమి న్యాయం..

Nana Patekar
Nana Patekar
నానా పటేకర్ పేల్చిన రాజకీయ తూటాలు
టెన్త్ ఫెయిల్ అయిన వారికి ఓటేసి.. 
బోల్ ఇండియా బోల్ - చేదు నిజాలు
 
రైతులు పొలంలో - రైతుల కొడుకులు సైన్యంలో మరణిస్తారు. కానీ నాయకులు దేశంలో, వారి సంతానం విదేశాల్లో, సౌఖ్యాలు పొందుతారు. చేదు నిజం ఏమంటే, ఈ దేశ వాసులమైన మనం ఇక్కడ పి.హెచ్.డి, గ్రాడ్యుయేషన్, మెడిసిన్, ఇంజనీరింగ్ చదివిన వాళ్లం, టెన్త్ ఫెయిల్ అయిన వాళ్ళకు ఓటు వేసి, నేతలుగా ఎన్నుకొని, వారి నుండి మన బంగారు భవిష్యత్తు కోసం కలలు కంటుంటాం. ఆలోచించండి.
 
రాజకీయ నేతలు కావాలనుకొనే వాళ్ళు ఐదు సంవత్సరాలు సైన్యంలో ఖచ్చితంగా పనిచేసి  తీరాలన్న నిబంధన పెడితే,
దేశంలో 80 శాతం ఉత్పాతాలు (దరిద్రాలు) వాటంతట అవే సర్దుకుంటాయి. 25-30 సంవత్సరాల పాటు ఉద్యోగాలు చేసిన వాళ్లకు పెన్షన్ ఉండదు. 
 
కానీ, ఐదేళ్లు రాజకీయ నేతగా పదవి వెలగబెడితే మాత్రం జీవితాంతం పెన్షన్, ఇతర సదుపాయాలు ఇస్తున్నారు.
ఇలా ఎందుకు ఇవ్వాలి? నాయకులపైకి చెప్పులో, కోడి గుడ్లో, నల్ల సిరానో, విసిరితే ఆ వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేస్తారు. కానీ, భారతీయ సైన్యంపై రాళ్ల దాడి చేసే వాళ్లకు మాత్రం మినహాయింపు ఇస్తారు. ఎందుకు? రైతుల సరుకుల వాహనాలపై తోలు వలిచి టోల్ వసూలు చేస్తున్నారు. కానీ, మంత్రి మహాశయుల వాహనాలకు అదేమీ ఉండదు.
 
రైతు తినేది దొంగ సొమ్మా? నేతలు తినేది కష్టార్జితమా? ఇదేమి న్యాయం.  విద్యలో రాజకీయం 100%, రాజకీయంలో విద్య 00% ఆహా ఎంత గొప్ప విధానం మన ఈ దేశంలో. ఇందుకేనేమో రాజకీయం అంతా చెత్తతో నిండిపోయింది.
 
దేశంలోని ప్రతిభావంతులేమో వలస పక్షులు అవుతున్నారు. దేశంలోని  ధర్మాసుపత్రుల్లో పరిస్థితులు మారాలంటే, నేతల పిల్లలకు వారి రోగాలకు చికిత్సలు కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే జరగాలి. అప్పుడే పరిస్థితులలో మార్పు చూస్తాం. రూ.399కి అపరిమిత కాల్స్ డేటా దొరుకుతుంటే ప్రజాప్రతినిధులకు నెలసరి రూ.15000 టెలిఫోన్ బత్తా ఎందుకు? ప్రజల చర్మం వలిచి పన్నులు వసూలు చేసే కోట్ల రూపాయలను ఇలా వృధాగా ఖర్చుచేయడం అవసరమా?
 అందరూ ఆలోచించాలి. 
 
మతం గురించి రాజకీయ నాయకులు రెచ్చగొడితే పేద వర్ణ ప్రజలు రెచ్చిపోయి సాటి మనిషిని దూరం పెట్టి, మతంలో మృగాలా మారిపోతున్నారు. కానీ అది రాజకీయ ఎత్తుగడ తెలుసుకోలేకపోతున్నాడు. దయచేసి మన దేశంలోని ఇలాంటి దరిద్ర వ్యవస్థ గురించి అందరికీ తెలిసేలా షేర్ చేయండి.. అంటూ నానా పటేకర్ పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.