సాహోకు సెన్సార్ గ్రీన్ సిగ్నల్.. నో కట్స్... యూఏ సర్టిఫికేట్?

బుధవారం, 21 ఆగస్టు 2019 (17:59 IST)
అభిమానులు ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్న సాహో సెన్సార్ పూర్తి చేసుకున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి, కానీ నిర్మాతలు ఇంకా ధ్రువీకరించలేదు. కంటెంట్ దృష్ట్యా ఎటువంటి కట్స్ లేకుండా అయితే ఏ మార్క్, లేదా కొన్ని చెప్పిన మార్పులు చేస్తే యు/ఎ ఇస్తామని అధికారులు చెప్పినట్టుగా టాక్ ఉంది. ఒకవేళ ఏ ఇస్తే చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. 
 
ముఖ్యంగా మల్టీ ప్లెక్సుల్లో 18 లోపు వయసు పిల్లలను సాహో చూసేందుకు అనుమతించరు. దీని వలన ఖచ్చితంగా వసూళ్ల మీద దెబ్బ పడుతుంది. పైగా ఆయా యాజమాన్యాలకు కూడా లేనిపోని తలనొప్పి. అలా కాకుండా యు/ఎ ఇస్తే ఎలాంటి సమస్యా ఉండదు. అందుకే కట్స్ మ్యూట్స్ లేకుండా యు/ఎ వచ్చేలా ప్రయత్నాలు సాగుతున్నట్లు తెలుస్తోంది.
 
రిలీజ్‌కు ఇంక కేవలం 9 రోజులు మాత్రమే గడువు ఉన్న నేపథ్యంలో ఇదో తీవ్రమైన అడ్డంకిగా ఉండకూడదనేది యువి ఆలోచన. దీనికి సంబంధించి స్పష్టత ఈరోజు లేదా రేపు వచ్చే అవకాశం ఉంది. సినిమా నిడివి ఇప్పటికే 2 గంటల 52 నిమిషాలు అనే టాక్ ఉంది. ఒకవేళ ఫైనల్ కట్‌లో ఏమైనా తగ్గించారేమో చూడాలి. ప్రస్తుతానికి అలాంటి సూచనలైతే కనిపించడం లేదు. 
 
అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఆన్‌లైన్‌లో ఇంకా మొదలుపెట్టలేదు. శనివారం నుంచి ప్రారంభించేలా ఏర్పాట్లు పూర్తయ్యాయని ఇన్‌సైడ్ టాక్. క్రాష్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి బుక్ మై షో లాంటి యాప్‌లు చర్యలు తీసుకుని తదనుగుణంగా అప్‌గ్రేడ్ చేస్తున్నాయి.

అన్నీ చూడండి

న్యాయం కోసం వెళ్తే.. గర్భవతిని చేసిన సీఐ.. పెళ్లి పేరెత్తేసరికి గర్భస్రావం.. ఎక్కడ?

భూవివాదం... చెల్లికి సపోర్ట్ చేసిందని మహిళను హత్య చేసిన సోదరుడు

మూడు, నాలుగు మంది పిల్లలు సరే.. సిజేరియన్‌తో హై రిస్క్.. హెచ్చరిస్తున్న వైద్యులు

Love Affair: కుమారుడి ప్రేమ వ్యవహారం జరిగిన హత్య.. పది మందికి జీవిత ఖైదు

సహ విద్యార్థినిపై అత్యాచారం చేసిన బీటెక్ విద్యార్థి.. మద్యం మత్తులో...?

అన్నీ చూడండి

లివర్ ఆరోగ్యం కోసం ఏం చేయాలి?

మామిడి పండ్లు తింటున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

బ్యాడ్ కొలెస్ట్రాల్ వుందా, ఇలా వదిలించుకోవచ్చు

మీ చాయ్‌: ఆంధ్రప్రదేశ్‌లో టీ కల్తీపై అవగాహన కల్పిస్తోన్న టాటా టీ చక్ర గోల్డ్ జెమిని

వాతావరణ మార్పులు, ప్రజల నేత్ర ఆరోగ్యం: తలెత్తుతున్న ఆందోళనలు

తర్వాతి కథనం
Show comments