'సాహో' మూవీ 'బాహుబలి' రికార్డును తిరగరాస్తుందా?

సోమవారం, 4 మార్చి 2019 (13:33 IST)
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం "సాహో". ఈ చిత్రంలో శ్రద్ధా కపూర్ హీరోయిన్‌గా నటిస్తుంటే సుజిత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏకంగా 300 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్నారు. 
 
'బాహుబలి' చిత్రం తర్వాత ప్రభాస్ నటిస్తున్న చిత్రం 'సాహో' కావడంతో ఇటు సినీ ఇండస్ట్రీలోనూ, అటు ఆయన అభిమానుల్లో భారీ అంచనాలు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో సాహో రెండో మేకింగ్ వీడియోను ఆదివారం హీరోయిన్ శ్రద్ధా కపూర్ పుట్టినరోజును పురస్కరించుకుని విడుదల చేశారు. 
 
ఈ మేకింగ్ వీడియో ఇపుడు యూట్యూబ్‌లో సంచలనాలు సృష్టిస్తోంది. ఈ ప్రోమో చూస్తే మూవీలో యాక్షన్ సీన్స్ అదిరిపోవడం ఖాయంగా కనిపిస్తున్నది. ఊహించినట్లే ఈ వీడియోకు ఫ్యాన్స్ నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది. వీడియో యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసిన 12 గంటల్లోనే 70 లక్షలకుపైగా వ్యూస్ రావడం విశేషం. 
 
అన్ని భాషల్లో రిలీజ్ చేసిన వీడియోలు అన్నింటికీ కలిపి ఈ వ్యూస్ వచ్చినట్లు సాహో టీమ్ ఓ ట్వీట్‌లో వెల్లడించింది. స్వాతంత్ర్య దినోత్సవం రోజున ప్రేక్షకుల ముందుకురానున్న ఈ చిత్రంలో ప్రభాస్‌, శ్రద్ధా కపూర్‌తో పాటు నీల్ నితిన్ ముకేశ్, అరుణ్ విజయ్, ఎవ్‌లిన్ శర్మ, జాకీ ష్రాఫ్, చుంకీ పాండే ప్రధాన పాత్రల్లో కనిపిస్తున్నారు. ఈ చిత్రాన్ని గత రెండేళ్లుగా నిర్మిస్తున్నారు.
 

అన్నీ చూడండి

SIRతో జాగ్రత్త, స్టాలిన్, మమతా బెనర్జీ అందుకే ఓడిపోయారు, మనం మరో రకంగా ఓడాము: జగన్

ఓటర్ల జాబితా సమగ్ర సవరణ చేపట్టే అధికారం ఈసీకి ఉంది : సుప్రీంకోర్టు

దేశంలో భానుడి భగభగలు... పౌరులకు ప్రధాని మోడీ సూచనలు

మహానాడు విధానం, స్ఫూర్తి మారలేదు.. కార్యకర్తలే బలం, బలగం.. చంద్రబాబు

2029 ఎన్నికల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు.. నారా లోకేష్ (video)

అన్నీ చూడండి

మంచినీటిలో నానబెట్టి తినాల్సిన ఆహారాలు ఏమిటి?

తీపి పదార్థాలను మోతాదుకి మించి తింటే ఏమవుతుందో తెలుసా?

మండుటెండలో నుంచి చల్లటి నీరు తాగితే...

నువ్వుల నూనెతో ప్రయోజనాలు ఏమిటి?

మెంతి ఆకుల పేస్టుతో ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments