శనివారం, 25 మే 2024
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
బుధవారం, 12 డిశెంబరు 2018 (13:23 IST)
సంబంధిత వార్తలు
నాకు బాలకృష్ణ ఎందుకు తెలీదు... గొప్ప హాస్యనటుడు... నాగబాబు దెబ్బకు అంతరిక్షం?
ఇంతకాలం ఏమి చేశావమ్మా..?
ప్రతిరోజూ స్వాతంత్ర్య దినోత్సవం...
పేట్టాలో త్రిష, రజనీకాంత్ లుక్ భలేగుంది..
చనిపోతున్నానని తెలిశాక జీవితం విలువ తెలిసింది : బాలీవుడ్ హీరోయిన్
మీరు ఉన్నారు ఎందుకు..?
భార్య: పక్కింటి ఆయనను చూడండి ప్రతీ ఆదివారం వాళ్ల ఆవిడను సినిమాకు తీసుకెళ్తాడు... మీరు ఉన్నారు ఎందుకు..?
భర్త: నేను ఆవిడని సినిమాకి తీసుకెళ్తే బాగుంటుందంటావా..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
సింహం లండన్ వెళ్లింది, జూన్ 4న జూలు విదిలిస్తుంది: జగన్ పైన ఎమ్మెల్యే తోపుదుర్తి
సింహం లండన్ వెళ్లింది, జూన్ 4న జూలు విదిలిస్తుంది అంటూ వైఎస్ జగన్ పైన ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వ్యాఖ్యానించారు. హిందూపురంలో బాలకృష్ణ ఓడిపోతున్నాడు, పిఠాపురంలో పవన్ కల్యాణ్ ఓడిపోతున్నాడు. కుప్పంలో చంద్రబాబు నాయుడు కూడా ఘోర పరాజయం చవిచూడబోతున్నాడు. వార్ వన్ సైడ్ జరిగింది. అనంతపురం పరిధిలోని 14 అసెంబ్లీ సీట్లు మొత్తం మావే. ప్రజలను పేకాటాడేసుకున్న తెలుగుదేశం పార్టీని ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రానివ్వరు.
సినీ ఫక్కీలో అర్థరాత్రి పూట గ్యాంగ్ వార్.. హైవేపై కార్ల ఢీ.. కర్రలతో కొట్లాట..
సినీ ఫక్కీలో కర్ణాటకలో అర్థరాత్రి పూట గ్యాంగ్ వార్ జరిగింది. హైవేపై కార్లు, కర్రలతో రణరంగాన్ని తలపించారు. కార్లు ఒకదాన్ని మరొకటి ఢీకొట్టుకున్నారు. అందులో ఉన్న కొందరు యువకులు బయటికి వచ్చి కర్రలతో ప్రత్యర్థులపై దాడి చేయడంతో ఆ ప్రాంతంలో తీవ్ర సంచలనంగా మారింది. ఆ యువకులు చేసిన స్టంట్లు.. ఆ హైవే పక్కనే ఉన్న ఓ బిల్డింగ్పై నుంచి స్థానికులు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం వైరల్గా మారాయి. కర్ణాటకలోని ఉడుపిలో ఉడుపి - మణిపాల్ హైవేపై ఈ నెల 18 వ తేదీన ఈ సంఘటన చోటు చేసుకుంది.
కేరళలో గూగుల్ మ్యాప్ ఎంత పనిచేసింది.. చెరువులో పడిన కారు
హైదరాబాద్కు చెందిన నలుగురు పర్యాటకులు కారులో మున్నార్ నుంచి అలప్పుజకు వెళుతున్నారు. శనివారం వేకువజామున 3 గంటల సమయంలో వారి కారు కురుప్పంతర పీర్ బ్రిడ్జి ప్రాంతంలో నీటి ప్రవాహంలో పడిపోయింది. అయితే గూగుల్ మ్యాప్స్ సాంకేతిక కారణాలతో వారికి అలప్పుజకు బదులు నీటి ప్రవాహంలోకి దారి చూపించిందని.. అది రాత్రిపూట కావడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెప్తున్నారు. కారు నీటిలో మునిగిపోవడాన్ని స్థానికులు గమనించారు.
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అమిత్ షా తనయుడు జైషా
కేంద్ర హోంమంత్రి అమిత్ షా తనయుడు, భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కార్యదర్శి జై షా ఇవాళ తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. జై షా వెంట ఆయన తల్లి సోనాల్ షా కూడా ఉన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల విచ్చేసిన జై షాకు టీటీడీ వర్గాలు స్వాగతం పలికాయి. స్వామి వారి దర్శనం తర్వాత సంప్రదాయబద్ధంగా ఆయనకు శేషవస్త్రం, తీర్థప్రసాదాలు అందజేశారు.
సాఫ్ట్వేర్ టెక్కీ భార్యను హత్య చేసి ముక్కలు చేయాలని గ్యాస్ బండతో: భర్త రాక్షసం
ఉమ్మడి కుటుంబాలు వున్నప్పుడు నేరాలు, ఘోరాలు కాస్త తక్కువగా వుండేవి. ఇప్పుడు అంతా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కావడంతో జంటలు మాత్రమే ఎవరికివారు వుంటున్నారు. ఏ చిన్న వివాదం చెలరేగినా అది తీవ్రమైన పరిణామానికి దారితీస్తోంది. ఇలాంటి వాటిలో హత్యలు, విడాకులు వుంటున్నాయి. చిన్నచిన్న వివాదాలనే సర్దుబాటు చేసుకోలేక ఇగోలకి పోయి క్షణికావేశంలో హత్యలు చేస్తున్న సందర్భాలు చోటుచేసుకుంటున్నాయి. హైదరాబాద్ బాచుపల్లిలో ఇదే జరిగింది. పూర్తి వివరాలను చూస్తే... సాయి అనురాగ్ కాలనీలో వుంటున్న నాగేంద్ర భరద్వాజ్, మధులత ఇద్దరూ సాఫ్ట్వేర్ ఇంజినీర్లు. వీరి స్వస్థలం ప్రకాశం జిల్లా. 2020లో ఇద్దరికీ వివాహం జరిగింది. వీరికి ఏడాదిన్నర కుమారుడు కూడా వున్నాడు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ఇవి తింటే చాలు మీ కాలేయం ఆరోగ్యం మీ చేతుల్లోనే
లివర్ లేదా కాలేయం. శరీరంలోని ఈ అవయవం 300 కంటే ఎక్కువ విభిన్న విధులను నిర్వహిస్తుంది, కాబట్టి దాని ఆరోగ్యం కోసం ఎంతో జాగ్రత్తగా ఉండటం ముఖ్యం. ఎలాంటి ఆహారం తీసుకుంటే ఆరోగ్యంగా వుంటుందో తెలుసుకుందాము. వెల్లుల్లిలో సెలీనియం ఉంటుంది, ఇది కాలేయం నుండి విషాన్ని బయటకు పంపుతుంది. బీట్రూట్ యాంటీఆక్సిడెంట్గా పనిచేస్తుంది, ఇది కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. బెర్రీస్ కాలేయ కణాలు, ఎంజైమ్లు దెబ్బతినకుండా కాలేయాన్ని రక్షించడమే కాక కొవ్వు కాలేయం నుండి వ్యర్థాన్ని తొలగిస్తాయి. డాండెలైన్ టీలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలుండటంతో ఇది కాలేయ సమస్యను నయం చేస్తుంది. ఆకుపచ్చ కూరగాయల్లో కాలేయాన్ని నిర్విషీకరణ చేసే ఐరన్, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు, గ్లూకోసినోలేట్లు ఉంటాయి.
ప్రోటీన్ సప్లిమెంట్లను భర్తీ చేయగల సహజమైన, ప్రోటీన్ అధికంగా కలిగిన ఆహారం
కండరాలు, కణజాలాలు, హార్మోన్ల కోసం అత్యంత కీలకమైనది ప్రోటీన్. జీవక్రియ నియంత్రణలో ఇది సహాయపడుతుంది, రోగనిరోధక పనితీరుకు మద్దతు ఇస్తుంది. స్థిరంగా శక్తిని అందిస్తుంది కాబట్టి మొత్తం ఆరోగ్యం కోసం ప్రోటీన్ అవసరం. చాలామంది ఇటీవలి కాలంలో సౌలభ్యం కోసం ప్రోటీన్ సప్లిమెంట్లపై ఆధారపడుతున్నారు, హైదరాబాద్ కేంద్రంగా కలిగిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (NIN) కొత్తగా విడుదల చేసిన ఆహార మార్గదర్శకాలు శరీర ద్రవ్యరాశిని నిర్మించడానికి వాటిని ఉపయోగించకూడదని సలహా ఇస్తున్నాయి. సహజ ప్రోటీన్ మూలాలను అర్థం చేసుకోవడం, ప్రాధాన్యత ఇవ్వడం యొక్క ప్రాముఖ్యతను ఇది నొక్కి చెబుతుంది.
షుగర్ వ్యాధిని అదుపులోకి తెచ్చే పదార్థాలు ఏంటి?
షుగర్ వ్యాధి. వ్యాయామం చేయడం, ఎక్కువ ఫైబర్ వున్న పదార్థాలు తినడం, ప్రోబయోటిక్ తీసుకోవడం పెంచడం వంటి చర్యలను చేపట్టి మధుమేహాన్ని కంట్రోల్ చేయవచ్చు. రక్తంలో చక్కెర స్థాయిలను సహజంగా ఎలా తగ్గించుకోవాలో తెలుసుకుందాము. నేరేడు విత్తనాలకు షుగర్ లెవల్స్ తగ్గించే గుణం వుంది కనుక వీటిని తీసుకుంటూ వుండాలి. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గించగల సామర్థ్యం మెంతులుకి వుంది, వీటిని ఆహారంలో భాగం చేసుకోవాలి. మదుమేహాన్ని వెల్లుల్లి కంట్రోల్ చేయడంలో మేలు చేస్తుంది కనుక దీనిని తీసుకుంటుండాలి. ఉసిరి రక్తంలో గ్లూకోజ్ జీవక్రియను మెరుగుపరిచి చక్కెర స్థాయిలను తగ్గించగలదు. వేప ఆకులను నమిలి తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయని ఆధారాలు ఉన్నాయి.
బెల్లం టీ తాగండి.. పొట్ట చుట్టూ కొవ్వును ఇట్టే కరిగించుకోండి..
లెమన్ టీ, గ్రీన్ టీల వలె బెల్లం టీ తీసుకుంటే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి. బెల్లంలో పోషకాలు మెండు. మెగ్నీషియం, బి కాంప్లెక్స్, విటమిన్ సి, కాల్షియం, పొటాషియం, విటమిన్ ఇ, విటమిన్ బి2 లాంటివి ఉంటాయి. బెల్లం టీ తీసుకోవడంవల్ల ఆహారం వెంటనే జీర్ణమవుతుంది. ఇలా అవడం వల్ల పొట్టలో కొవ్వు పేరుకుపోదు. పొట్టచుట్టూ కొవ్వు చేరకుండా ఇది సహాయపడుతుంది. ఐరన్ లోపం ఉంటే రక్తహీనత తలెత్తుంది. దీంతో బరువు పెరిగే ప్రమాదం వుంది.
కిడ్నీలను ఆరోగ్యంగా వుంచుకునే ఆహారం.. ఖాళీ కడుపుతో వెల్లుల్లి..
కిడ్నీలను ఆరోగ్యంగా వుంచుకోవాలంటే ఈ ఆహారం తీసుకోవాల్సిందే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఆకుపచ్చని కూరగాయలు మూత్రపిండాలకు చాలా మేలు చేస్తాయి. కిడ్నీ ఆరోగ్యానికి విటమిన్ బీ6, బీ9, సీ, విటమిన్ కె ముఖ్యమైనవి. ఈ విటమిన్లన్నీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండేందుకు తోడ్పడతాయి. రోజూ ఖాళీ కడుపుతో వెల్లుల్లి తింటే కిడ్నీ సంబంధిత సమస్యలు లేకుండా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, అల్లిసిన్ కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుతాయి.