650 ఎంఎల్ వాటర్ బాటిల్‌ ధరెంతో తెలుసా?

బుధవారం, 12 జులై 2023 (09:58 IST)
Water
ఇష్టమైన రెస్టారెంట్లలో తినడం అందరికీ బాగా నచ్చుతుంది. ప్రజలు మంచి ఆహారం కోసం అదనంగా ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అదే సమయంలో కొన్ని ఉత్పత్తుల ధర ప్రమాణం కంటే ఎక్కువగా ఉన్నప్పుడు వారు అభ్యంతరం వ్యక్తం చేస్తారు. అందుకు సంబంధించి 650 ఎంఎల్ వాటర్ బాటిల్‌కు రూ.350 వసూలు చేసిన ఘటనపై యువతి ట్విట్టర్‌లో పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
ఈ విషయమై రితికా బోరా అనే యువతి ఓ హైక్లాస్ రెస్టారెంట్‌లో తనకు ఎదురైన అనుభవం గురించి ట్విట్టర్ పోస్ట్‌లో చెప్పింది. 'మీరు నమ్మరు, నేను లంచ్ కోసం ఒక హై-ఎండ్ రెస్టారెంట్‌కి వెళ్లినప్పుడు, 650 ఎంఎల్ వాటర్ బాటిల్‌కు రూ. 350 వసూలు చేశారు. నేను వాటర్ బాటిల్‌ను ఇంటికి తీసుకెళ్లాలని ప్లాన్ చేసాను. 
 
ఎందుకంటే నేను దానిని తిరిగి ఉపయోగించగలను. తన పోస్ట్‌లో వాటర్ బాటిల్ ఫోటోను కూడా షేర్ చేసింది. ఇది సహజమైన మినరల్ వాటర్ అని, హిమాలయ రాజ్యమైన భూటాన్ నుండి తీసుకువచ్చినట్లు" బోరా పేర్కొంది. 10వ తేదీన షేర్ చేసిన ఈ పోస్ట్‌ను 5 లక్షల మందికి పైగా వీక్షించారు. 4 వేల మందికి పైగా లైక్ చేసి తమ కామెంట్లను పోస్ట్ చేశారు.

అన్నీ చూడండి

'దేశీ ప్రిన్సెస్‌'లా మెరిసిపోతున్న జాన్వీ కపూర్

Nani: 150 మిలియన్+ వ్యూస్ తో నాని ది ప్యారడైజ్ ఆయా షేర్ సాంగ్

Devi Sri Prasad: ఎల్లమ్మ చేయడానికి స్ఫూర్తిని ఇచ్చిన గ్రామం వెదురుపాక: దేవిశ్రీ ప్రసాద్

Karthi: ఈ ఏడాది చిత్రాల సందడితో 49వ పుట్టినరోజు జరుపుకుంటున్న కార్తి

కెమెరాతో కథ చెప్పాలి, రీ-రికార్డింగ్‌కి కూడా కథలో స్పేస్ ఉండాలి : కెమెరామెన్ రత్నవేలు

తర్వాతి కథనం
Show comments