తప్పులే తప్పులు.. ఓ వ్యక్తి వయస్సు.. 350 సంవత్సరాలట.. ఎక్కడ?

బుధవారం, 14 నవంబరు 2018 (11:30 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో ఓటర్ల జాబితా ఇటీవల విడుదలైంది. ఈ ఓటర్ల జాబితాలో 15 శాతం ఓటర్ల వివరాలు తప్పులేనని తేలింది. ముఖ్యంగా ఓ ఓటర్ కార్డులో వ్యక్తి వయస్సును 350గా ఎన్నికల సంఘం నమోదు చేయడం ప్రస్తుతం అందరికీ షాక్ ఇచ్చింది. ఓటర్ల జాబితాలో ఓ వ్యక్తి వయస్సు 350గా పేర్కొనబడటంపై నెట్టింట రచ్చ జరిగింది.
 
దీన్ని గమనించిన ఈసీ అధికారులు వివరణ ఇచ్చుకున్నారు. సదరు ఓటర్ కార్డులోని వ్యక్తి వయస్సు 35 సంవత్సరాలు కాగా.. 350గా పడిందని.. ఇది ప్రింటింగ్ మిస్టేక్ అంటూ ఈసీ తెలిపింది. ఏపీలో 3.6 కోట్ల ఓటర్లున్న నేపథ్యంలో.. ప్రస్తుతం విడుదలైన ఓటర్ల జాబితాలో 52.67 లక్షల ఓటర్ల వివరాలు తప్పుల తడకగా వున్నాయి. ప్రస్తుతం వీటిని సరిదిద్దే, సవరించే పనుల్లో అధికారులున్నారు.
 
అయితే 350 ఏళ్ల వయస్సులో ఓ వ్యక్తి ప్రాణాలతో వున్నాడా... ఇదేదో గిన్నిస్ రికార్డులో నమోదు కావాల్సింది.. అని నెటిజన్లు జోకులు పేల్చుతున్నారు. విజయవాడకు చెందిన తుమ్మల లోకేశ్వర్ రెడ్డి ఓటర్ ఐడీ కార్డులో.. అతని వయస్సును 350గా ఈసీ ప్రింట్ చేయడంపై సర్వత్రా చర్చనీయాంశమైంది. 

అన్నీ చూడండి

ప్రతి హనీమూన్ స్విట్జర్లాండ్‌లోనే ఎందుకు ముగియాలి? కమల్ హాసన్

తమిళనాడు సీఎం విజయ్ కొడుకు జాసన్ విషయంలో అంత కఠినంగా ఎందుకో?

Spider-Man: స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే కొత్త పోస్టర్

Sureshbabu: నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, పంపిణీదారుల సమస్యలకు సబ్ కమిటీ ఏర్పాటు

Peddi : పెద్ది నుంచి శివరాజ్ కుమార్, దివ్యేందు శర్మ ఫెరోషియస్ లుక్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments