అయోధ్య తీర్పు కోసం ఎదురు చూపులు...

సోమవారం, 4 నవంబరు 2019 (09:43 IST)
అయోధ్యలో రామజన్మభూమి - బాబ్రీ మసీదు వివాదం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వందేండ్లకుపైగా కొనసాగుతున్న ఈ వివాదంపై తుది తీర్పు ఇచ్చేందుకు సుప్రీంకోర్టు సిద్ధమైంది. సీజేఐ రంజన్‌ గొగోయ్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఈ కేసులో 46 రోజులపాటు రోజువారీ విచారణ జరిపింది. 
 
అన్ని పక్షాల వాదలను విన్న అనంతరం.. తీర్పును రిజర్వ్‌లో ఉంచుతున్నట్టు గత నెల 16న ప్రకటించింది. ధర్మాసం ఏకగ్రీవంగా నిర్ణయాన్ని వెల్లడిస్తుందా? లేదా 4-1, 3-2 తేడాతో నిర్ణయం వెలువరిస్తుందా? అని ఆసక్తి నెలకొంది. ఈ తీర్పు ఎవరికి అనుకూలంగా ఉన్నా సామాజికంగా తీవ్ర ప్రభావం చూపనున్నది. 
 
ముఖ్యంగా వచ్చే తరాలపై తీర్పు ప్రభావం ఉంటుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో హిందూ, ముస్లిం సంస్థల పెద్దలు తీర్పు ఎవరికి అనుకూలంగా వచ్చినా సంయమనం పాటించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. అదేసమయంలో తీర్పు వచ్చిన వెంటనే నిర్మాణాలు ప్రారంభించకుండా.. కొన్నాళ్లపాటు ఆ స్థలాన్ని ఖాళీగా ఉంచాలని కోరుతున్నారు. మొత్తంమీద అయోధ్యపై సుప్రీంకోర్టు ఇచ్చే తుది తీర్పు పట్ల దేశం యావత్తూ ఉత్కంఠతగా ఎదురు చూస్తోంది. 

అన్నీ చూడండి

'పెద్ది'లో చరణ్ పెర్ఫార్మెన్స్ మైండ్‌బ్లోయింగ్‌, ఫ్యామిలీతో కలిసి చూడండి: దర్శకుడు బుచ్చిబాబు సానా

రవితేజ, శివ నిర్వాణ, మైత్రి మూవీ మేకర్స్ ఇరుముడి నుంచి ది హార్ట్ ఆఫ్ ఇరుముడి గ్లింప్స్‌ రిలీజ్

మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ బాబీ చిరు158 పొల్లాచ్చిలో కీలక షెడ్యూలు ప్రారంభం

విశాఖపట్నం రోడ్డు ప్రమాదం.. డ్యాన్స్ మాస్టర్ పండు తీవ్రగాయాలు (video)

రోడ్డు ప్రమాదంలో 'ఢీ' జోడీ డ్యాన్స్ మాస్టర్ పండుకు గాయాలు

తర్వాతి కథనం
Show comments