సీఎం కుర్చీలో నేరస్థులా? అందుకే నాడు మోడీని తప్పించాలని కోరా...

గోద్రా అల్లర్ల తర్వాత ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీని తప్పించాలని డిమాండ్ చేసిన మాట వాస్తవమేనని, ఇందులో తప్పేముందని టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుర్తుచేశారు.

బుధవారం, 4 ఏప్రియల్ 2018 (11:43 IST)
గోద్రా అల్లర్ల తర్వాత ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీని తప్పించాలని డిమాండ్ చేసిన మాట వాస్తవమేనని, ఇందులో తప్పేముందని టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుర్తుచేశారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన జాతీయ మీడియాతో మాట్లాడే సమయంలో గుజరాత్ అల్లర్ల తర్వాత మోడీని ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించాలని అందరికన్నా ముందు మీరే కదా డిమాండ్ చేశారు అనే ప్రశ్న ఎదురైంది. 
 
దీనికి సీఎం సమాధానమిస్తూ, అవునని చెప్పారు. జరిగిన విషయాలను చరిత్ర రికార్డుల నుంచి ఎవరూ చెరిపివేయలేరని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసమే మోడీతో చేతులు కలిపానని... కానీ, ఆయన ఇలా చేస్తారని తాను అనుకోలేదని చెప్పారు. అప్పట్లో మీరు అన్న మాటలను మోడీ గుర్తుంచుకున్నారేమో అనే ప్రశ్నకు బదులుగా... గుర్తుంచుకొని ఉండవచ్చేమో అని నవ్వుతూ సమాధానం ఇచ్చారు. నేరారోపణలు ఎదుర్కొనేవారు అత్యున్నత స్థానాల్లో ఉండరాదనే తాను ఆ తరహా డిమాండ్ చేసినట్టు చెప్పారు. 

అన్నీ చూడండి

అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాణంలో పళ్ళబురుసు చిత్రం ప్రకటన

Dixith Shetty :దీక్షిత్ శెట్టి, శశి ఓదెల చిత్రానికి #KJQ (కింగ్ జాకీ క్వీన్) పేరు ఖరారు

Fauji Poster Controversy: ఫౌజీ రిలీజ్ డేట్ పోస్టర్ లో ప్రభాస్ కాలి వేళ్లపై అభిమానుల్లో రచ్చ ?

Samantha: చిత్తూరులో సమంతకు సీమంతం

అల్లు అర్జున్ క్యాంప్ నుంచి మరో నిర్మాత శరత్‌చంద్ర నాయుడు

తర్వాతి కథనం
Show comments