ఉక్రెయిన్ నుంచి భారత్‌ పౌరుల తరలింపు - రొమేనియా నుంచి బయలుదేరిన విమానం

శనివారం, 26 ఫిబ్రవరి 2022 (16:22 IST)
ఉక్రెయిన్ రష్యా దేశాల మధ్య భీకర యుద్ధం జరుగుతుంది. దీంతో ఉక్రెయిన్‌లో భారతీయ పౌరులు, విద్యార్థులను సురక్షితంగా స్వదేశానికి తరలించేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులోభాగంగా, ఉక్రెయిన్ సరిహద్దు దేశమైన రొమేనియాకు ప్రత్యేక విమానాలను నడుపుతుంది. ఇక్కడ నుంచి ఓ విమానం కూడ బయలుదేరింది. ఇందులో 219 మంది వస్తున్నారు. వీరిలో అనేక తెలుగు విద్యార్థులు కూడా ఉన్నారు. ఈ విషయాన్ని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ స్వయంగా వెల్లడించారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. 
 
భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ సూచనలు పాటిస్తూ రొమేనియా సరిహద్దులకు చేరుకున్న 219 మంది భారతీయులను ఆ విమానం ద్వారా ముంబైకు పంపినట్టు ఆయన తెలిపారు. అలాగే, ఉక్రెయిన్‌లో మిగిలిన భారతీయులను కూడా సురక్షితంగా భారత్‌కు తరలించేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నట్టు చెప్పారు. ఈ మొత్తం ప్రక్రియను స్వయంగా తానే పర్యవేక్షిస్తున్నట్టు మంత్రి జైశంకర్ వెల్లడించారు. అలాగే, భారతీయ పౌరులను తరలింపులో పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్న రొమేనియా విదేశాంగ మంత్రి బోగ్డాన్ అరెస్కూకు ధన్యవాదాలు తెలుపుతున్నట్టు పేర్కొన్నారు. 

అన్నీ చూడండి

కోలీవుడ్‌లో తండ్రీతనయుల పోటీ.. చివరకు వెనక్కి తగ్గిన కుమారుడు...

పట్టభద్రులైన విద్యార్థుల్ని, బంగారు పతకం సాధించిన దీపికను అభినందించిన విశాల్

Prabhas: ప్రభాస్ లాంచ్ చేసిన వరుణ్ తేజ... కొరియన్ కనకరాజు టీజర్‌

Jani Master: మా మధ్య గొడవలు లేవు, డ్యాన్సర్ హెల్త్ ఇన్సూరెన్స్‌కి 18 లక్షలు విరాళం : జానీ మాస్టర్

Bhagyashri: రాజమౌళి గారి దర్శకత్వంలో రాణి లా నటించాలని కోరిక : భాగ్యశ్రీ బోర్సే

తర్వాతి కథనం