Webdunia - Bharat's app for daily news and videos

Install App

మధ్యప్రదేశ్ సీఎం కమల్ నాథ్ రాజీనామా... నాకు పదవితో సంబంధం లేదంటూ...

Written By ఐవీఆర్
Updated: శుక్రవారం, 20 మార్చి 2020 (13:46 IST)
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాథ్ తన పదవికి రాజీనామా చేశారు. నిజానికి ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ఆయన మధ్యప్రదేశ్ అసెంబ్లీలో బలపరీక్షకు సిద్ధం కావాల్సి వుండగా అంతకంటే ముందుగానే ఆయన తన తన రాజీనామాను ప్రకటించారు. గవర్నర్ లాల్జీ టాండన్‌ను కలవడానికి మధ్యాహ్నం 1 గంటలకు రాజ్ భవన్‌ను సందర్శిస్తానని చెప్పారు. 
 
ఇంకా ఆయన మాట్లాడుతూ... బిజెపి నా సంకల్పాన్ని బలహీనపరచలేదు, నా రాష్ట్ర ప్రజల కోసం పని చేస్తూనే ఉంటాను అన్నారు. పదవితో సంబంధం లేకుండా మేము ప్రజల కోసం కృషి చేస్తూనే ఉంటాం. నేను రాజీనామా చేయబోతున్నాను, ఈ విషయంలో గవర్నర్‌ను కలుస్తాను అని అన్నారు.
 
మరోవైపు బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే తాను మద్దతు ఇస్తానని స్వతంత్ర ఎమ్మెల్యే చెప్పారు. స్వతంత్ర ఎమ్మెల్యే ప్రదీప్ జైస్వాల్ మాట్లాడుతూ, "స్వతంత్ర ఎమ్మెల్యే కావడం, ఇప్పుడు నా ప్రజల అభివృద్ధి కోసం ఏర్పడబోయే కొత్త ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం తప్ప నాకు వేరే మార్గం లేదు. నేను వారితో మాట్లాడాను. వారు కూడా నా మద్దతు తీసుకునేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు"

అన్నీ చూడండి

ఓటరు కార్డు చిరునామా మార్చుకోమంటుంటే ప్రభుత్వాన్నే మార్చేస్తానంటారేంటి ప్రకాష్ రాజ్?!! వీడియో

హైదరాబాద్‌ను ఉర్రూతలూగించనున్న రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్

Rahul Sipligunj Case: రాహుల్ సిప్లగింజ్ కేసు.. ఒకవేళ ఆమె రాకపోతే...?

దేవ కట్టా సమర్పణలో రా, రస్టిక్, రొమాంటిక్ కామెడీ చిత్రం జో జో’

నేను రెడీ నుంచి హవీష్, కావ్య థాపర్ పై మస్తుగుందిరా యవ్వారం సాంగ్

తర్వాతి కథనం
Show comments