బాధితుల శరీరాన్ని తాకినా మంకీపాక్స్ సోకుతుంది...

సోమవారం, 1 ఆగస్టు 2022 (10:45 IST)
దేశంలో మంకీపాక్స్ కేసులు పెరుగుతున్నాయి. తొలి మంకీపాక్స్ మృతి కేసు నమోదైంది. విదేశాల నుంచి కేరళ రాష్ట్రానికి వచ్చిన ఓ యువకుడు ఈ వైరస్ నుంచి కోలుకోలేక మృతి చెందాడు. ఇది మన దేశంలో నమోదైన తొలి మృతి కేసు. అయితే, ఈ మంకీపాక్స్ వైరస్...  బాధితుల శరీరాన్ని తాకడం, పట్టుకోవడం ద్వారా సన్నిహితంగా మెలగడం వల్ల కూడా ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందే అవకాశం ఉన్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు. 
 
స్వలింగ సంపర్కులే దీని వ్యాప్తికి కారకులుగా పేర్కొనడం.. ఎయిడ్స్‌ విషయంలో చేసిన పొరపాటును పునరావృతం చేయడమే అవుతుందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కేవలం స్వలింగ సంపర్కుల్లోనే కాకుండా ఎవరికైనా మంకీపాక్స్‌ వ్యాప్తిచెందే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. 
 
బాధితుల శరీరాన్ని లేదా వారి దుస్తులను తాకడం వల్ల కూడా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుందని ఎయిమ్స్‌ (ఢిల్లీ) డెర్మటాలజీ, వెనెరియాలజీ విభాగం ప్రొఫెసర్‌ డాక్టర్‌ సోమేశ్‌ గుప్తా తెలిపారు. ఈ మేరకు బాధితులతో కలిసిమెలిసి ఉండే కుటుంబ సభ్యులు, స్నేహితులు జాగ్రత్తలు పాటించాలని ఆయన కోరారు. 

అన్నీ చూడండి

PM Modi: ప్రధాని మోదీ పెద్ది గురించి అడిగారు, వెస్ట్ బెంగాల్‌లో యూత్ పెద్ది గెటప్‌తో వచ్చారు: రామ్ చరణ్

Radhya: ది రెడ్ బ్యాగ్ చిత్రం నుంచి హీరోయిన్ రాధ్య లుక్

Satyadev: బిహైండ్ ది వుడ్స్ ఆఫ్ సమవర్తి మేకింగ్ లో సత్యదేవ్

Vadenaveen: వడ్డే నవీన్‌ ట్రాన్స్‌ఫ‌ర్ త్రిమూర్తులు నుంచి తొలి సాంగ్ ‘టా టా’ను విడుదల

హర్షిత్ రెడ్డి దీవాన మూవీ నుంచి వన్ సైడ్ లవ్ స్టోరీ పాటకు ఆదరణ

తర్వాతి కథనం
Show comments