Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేంద్రంపై అవిశ్వాస తీర్మానం... స్పీకర్‌కు ఐదు పార్టీల నోటీసులు

కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానంపై సర్వత్రా ఉత్కంఠత నెలకొంది. స్పీకర్‌కు ఐదు పార్టీలు కలిసి అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చాయి. తొలుత కేవలం టీడీపీ, వైసీపీలు మాత్రమే అవిశ్వాస తీర్మానం ఇవ్వగా... చివ

Written By pnr
Updated: మంగళవారం, 27 మార్చి 2018 (11:12 IST)
కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానంపై సర్వత్రా ఉత్కంఠత నెలకొంది. స్పీకర్‌కు ఐదు పార్టీలు కలిసి అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చాయి. తొలుత కేవలం టీడీపీ, వైసీపీలు మాత్రమే అవిశ్వాస తీర్మానం ఇవ్వగా... చివర్లో కాంగ్రెస్ కూడా ఆ జాబితాలో చేరింది. తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వంపై సీపీఎం, ఆర్ఎస్పీ కూడా అవిశ్వాస తీర్మానాలు ఇచ్చాయి. టీడీపీ ఎంపీ కేశినేని నాని కూడా సొంతంగా మరో అవిశ్వాస తీర్మానాన్ని ఇచ్చారు. ఈ నేపథ్యంలో, మంగళవారం పార్లమెంటులో కేంద్రంపై ముప్పేట దాడికి విపక్షాలు సిద్ధమవుతున్నాయి.
 
మరోవైపు, ఇన్ని రోజులు రిజర్వేషన్లపై పోరాడుతూ, అవిశ్వాసంపై చర్చకు అంతరాయం కలిగించిన టీఆర్ఎస్ పార్టీ సైతం తన వైఖరి మార్చుకుంది. అవిశ్వాసంపై చర్చకు తాము సహకరిస్తామని ఆ పార్టీ ఎంపీలు తెలిపారు. ఇకపోతే కావేరీ బోర్డు గురించి అన్నాడీఎంకే ఎంపీలు యధావిధిగా తమ ఆందోళనలకు కొనసాగిస్తున్నారు. మరోవైపు, అవిశ్వాసం తీర్మానాలను లోక్‍సభలో మంగళవారం అడ్మిట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నారు. 
About Author
pnr
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... Read More

అన్నీ చూడండి

చైనా పీస్ కు యా/ఏ సర్టిఫికెట్‌, సెప్టెంబర్‌లో రిలీజ్

Varun Tej : ఒకే బాడీలో రెండు ఆత్మలు ఉండే ఛాలెంజింగ్ ఫాత్ర పోషించా : వరుణ్ తేజ్

Anupama: క్రేజీ కల్యాణం వంద కోట్లు వసూళ్ళతో చరిత్ర సృష్టించాలి : నందిని రెడ్డి

Nani: ది ప్యారడైజ్ లో నాని, కాయదు లోహర్ పై సాంగ్, త్వరలో టీజర్

Vinayak: కేఎల్ యూనివర్సిటీ చూడగానే రామోజీ ఫిల్మ్ సిటీ గుర్తుకువస్తుంది: వినాయక్

తర్వాతి కథనం
Show comments