మోదీ యోగ ఫోటోపై ట్విట్టర్లో ట్వింకిల్ ఖన్నా సెటైర్

మంగళవారం, 21 మే 2019 (13:51 IST)
ప్రధాని నరేంద్ర మోదీ ప్రచారపర్వం ముగిసిన తర్వాత కేథార్‌నాథ్‌ ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంలో కాషాయ వస్త్రాలు ధరించి, చేతిలో కర్రతో మోదీ దర్శనమిచ్చారు. అనంతరం స్థానికంగా ఓ పవిత్ర గుహకు కాలినడకన వెళ్లి అక్కడ కాసేపు ధ్యానం చేసుకున్నారు. యోగముద్రలో మోడి కూర్చొని ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచార్యం పొందాయి. 
 
వీటిపై అనేకమంది నెటిజన్లు పలురకాలుగా స్పందించారు. ఇదంతా ఒక ఎత్తయితే బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ సతీమణి ట్వింకిల్ ఖన్నా మోదీని ఉద్దేశిస్తూ వ్యగ్యంగా ఓ ఫోటోను ట్విట్టర్లో  పోస్టు చేసింది. ‘‘ఈమధ్య కాలంలో ఇంటర్నెట్‌లో ఆధ్యాత్మికతకు సంబంధించిన ఫోటోలు ఎక్కువుగా కనపడుతున్నాయి. 
 
అందుకే నేను కూడా మెడిటేషన్ ఫోటో కోసం అనేక ఫోజులు ప్రయత్నిస్తున్నానని పేర్కొంది. ఈ ఫోటో షూట్ వెడ్డింగ్ షూట్ కంటే బాగుందని తనదైన శైలిలో విమర్శించింది. ట్వింకిల్ ఖన్నా ఇదివరకు చాలాసార్లు మోదీపై విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే.

అన్నీ చూడండి

ప్రతి హనీమూన్ స్విట్జర్లాండ్‌లోనే ఎందుకు ముగియాలి? కమల్ హాసన్

తమిళనాడు సీఎం విజయ్ కొడుకు జాసన్ విషయంలో అంత కఠినంగా ఎందుకో?

Spider-Man: స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే కొత్త పోస్టర్

Sureshbabu: నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, పంపిణీదారుల సమస్యలకు సబ్ కమిటీ ఏర్పాటు

Peddi : పెద్ది నుంచి శివరాజ్ కుమార్, దివ్యేందు శర్మ ఫెరోషియస్ లుక్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments