రైలు ప్రయాణికుడిని చితక్కొట్టిన టీసీలు.. సస్పెండ్ చేసిన రైల్వే శాఖ

Written By వరుణ్
Updated: శుక్రవారం, 6 జనవరి 2023 (14:09 IST)
ప్రయాణ టిక్కెట్ లేకుండా ప్రయాణం చేస్తున్న ఓ ప్రయాణికుడిపై ఇద్దరు టీసీలు దాడి చేశారు. ఈ దాడిలో ప్రయాణికుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ దాడి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. దీనిపై రైల్వేశాఖ సీరియస్‌గా స్పందించింది. ప్రయాణికుడిపై దాడి చేసిన ఇద్దరు టీసీలను సస్పెండ్ చేసింది. 
 
ఈ ఘటనకు సంబంధించిన వివరాలను పరిశీలిస్తే, ముంబై నుంచి జైనగర్ వెళుతున్న ఎక్స్‌ప్రెస్ రైలులో ఓ ప్రయాణికుడు టిక్కెట్ లేకుండా జనరల్ బోగీలో అప్పర్ బెర్త్ సీట్లో కూర్చొనివున్నాడు. ఆ బోగీలోకి వచ్చిన ఇద్దరు టీసీలు ఆప్రయాణికుడితో వాగ్వాదానికి దిగారు. దీంతో ఇద్దరు టీసీల్లో ఒకరు సదరు ప్రయాణికుడిని కాలు పట్టుకుని కిందకు లాగిపడేశాడు. ఆ తర్వాత బూటుకాలితో నడుంపై తన్నగా మరో టీసీ ముఖంపై తన్నాడు. 
 
దీంతో ఇతర ప్రయాణికుులు టీసీలను నిలదీయడంతో వారు వెనక్కి తగ్గారు. ఈ దాడి ఘటనను కొందరు ప్రయాణికులు మొబైల్ ఫోన్లలో వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో రైల్వే శాఖ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో వారు సీరియస్‌గా తీసుకుని ఇద్దరు టీసీలను సస్పెండ్ చేశారు. ఈ ఘటన దోలీ రైల్వే స్టేషన్ సమీపంలో జరిగింది. 

అన్నీ చూడండి

అబ్జెక్ష‌న్ మై లార్డ్‌కు అండగా మెగాస్టార్ చిరంజీవి

Jayasudha : సమ్మర్ హాలిడేస్.. లో అమ్మమ్మ సుశీలమ్మగా జయసుధ

Rahul Sipligunj : బైక్ రైడర్ సీటులో దారిచూపిన వ్యక్తి అంటూ ఆనందక్షణాలతో రాహుల్ సిప్లిగంజ్‌

Prashanth Neel : డ్రాగన్ కు ముందు భయపెట్టే చిత్రంగా ప్రశాంత్ నీల్ 418 చిత్రం సిద్ధమైంది

Allari Naresh :సురభి తో నా కంటి మీద కునుకే లేదంటున్న అల్లరి నరేష్

తర్వాతి కథనం
Show comments