ఖైరతాబాద్ శ్రీకైలాస విశ్వరూప మహాగణపతికి 5 టన్నుల లడ్డు

గురువారం, 28 ఆగస్టు 2014 (13:49 IST)
రేపు వినాయక చవితి సందర్భంగా ఖైరతాబాద్ శ్రీకైలాస విశ్వరూప మహాగణపతికి 5 టన్నుల లడ్డును తూర్పుగోదావరి జిల్లా తాపేశ్వరం నుంచి పంపేందుకు పంపుతున్నారు. 5,000 కిలోలు బరువున్న ఈ తాపేశ్వరం లడ్డును రూ. 15 లక్షల వ్యయంతో తయారు చేసినట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఈ లడ్డును గవర్నర్ చేతులు మీదుగా గణేశునికి సమర్పించనున్నట్లు తెలియజేశారు.
 
ఏటేటా తూర్పు గోదావరి జిల్లా మండపేట మండలం తాపేశ్వరానికి చెందిన సురుచి ఫుడ్స్ ఈ ప్రసాదాన్ని సమర్పిస్తుంది. 2010లో 500 కిలోల లడ్డూతో ప్రారంభమైన ఈ ప్రసాద పంపిణీ ఈ ఏడాది 5000 కిలోలకు చేరిందని సురుచి ఫుడ్స్ అధినేత పోలిశెట్టి మల్లిబాబు తెలియజేశారు.
 
60 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఖైరతాబాద్ గణపతిని ఈ ఏడాది శ్రీకైలాస విశ్వరూప మహాగణపతిగా నామకరణం చేశారనీ, తాము ఈ నెల 21న తనతోపాటు 16 మంది గణేష్ మాల ధరించి మహాలడ్డూ తయారీ పనులు ప్రారంభించి పూర్తి చేసినట్లు వెల్లడించారు. లడ్డూను భారీ ట్రాలీపై ఊరేగింపుతో ప్రత్యేక వాహనంలో ఖైరతాబాద్ తీసుకెళ్లనున్నట్లు తెలిపారు.

అన్నీ చూడండి

నలుగురైదుగురు భార్యలని మాట్లాడి ఓ పార్టీ భూస్థాపితం, ఇదేనా జర్నలిజం: తెలంగాణ జనసేన

అమిత్ షా గారూ, ఆయన్ని అరెస్ట్ చేయరా: డిప్యూటీ సీఎం పవన్ డైలాగ్‌తో పగలబడి నవ్విన జనసైనికులు, వీడియో

Vijay : ఢిల్లీలో ప్రధానిని కలిసిన తమిళనాడు సీఎం విజయ్

రాగి శాసనాలను స్వదేశానికి తెప్పించిన ప్రధాని మోడీ.. ప్రశంసించిన సీఎం విజయ్

మమతా బెనర్జీకి షాకిచ్చిన బరాసత్ ఎంపీ... అన్ని పదవులకు రిజైన్

అన్నీ చూడండి

28-05-2026 గురువారం ఫలితాలు - ధనం మితంగా ఖర్చు చేయండి

మూడేళ్లకు ఒకసారి వచ్చే పద్మిని ఏకాదశి.. తులసి దళాలతో అర్చన చేస్తే?

27-05-2026 బుధవారం ఫలితాలు- దంపతుల మధ్య అకారణ కలహం

Eid Al-Adha 2026 date: తెలుగు రాష్ట్రాల్లో మే 28, 2026 గురువారం బక్రీద్.. సెలవు దినం

26-05-2026 మంగళవారం ఫలితాలు - ధనసహాయం తగదు

Show comments