మహిళల్లో ఇరెగ్యులర్ పీరియెడ్స్... ఏం చేయాలి?

సోమవారం, 20 జనవరి 2020 (20:06 IST)
చాలామంది మహిళల్లో పీరియెడ్స్ ఇరెగ్యులర్‌గా వస్తుంటాయి. ఈ సమస్యను అధిగమించేందుకు జీవన విధానంలో మార్పులు చేసుకోవాలి. కొన్ని రకాల సీడ్స్ తీసుకోవడం వల్ల హార్మోన్లలో సమతుల్యత ఏర్పడి సమస్య తగ్గే అవకాశం వుంటుంది. ముఖ్యంగా గింజల్లో ఒమేగా 3, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్లే కాకుండా, వీటిలో వుండే జింక్, సెలీనియం ఎలిమెంట్స్ వల్ల హార్మోన్ల సమతుల్యత ఏర్పడుతుంది.
 
సమస్య వున్నవారు సీడ్ సైక్లింగ్ పాటించాలి. అంటే... ఓ సైకిల్‌లా గింజలు తీసుకోవడం అన్నమాట. గుమ్మడి గింజలు, అవిసె గింజలు మొదటి రోజు నుంచి 14 రోజుల వరకూ ఓ టేబుల్ స్పూన్ చొప్పున తీసుకోవాలి. మొదటి రోజు అంటే పీరియడ్స్ ప్రారంభమైన రోజు. ఇక 15వ రోజు నుంచి 28వ రోజు వరకూ నువ్వులు, పొద్దుతిరుగుడు గింజలు ఓ టేబుల్ స్పూన్ చొప్పున తీసుకోవాలి. ఒకేసారి కాకుండా 3 భాగాలు చేసి మూడు పూటలా తీసుకోవాలి. గింజలను పొడి చేసి మజ్జిగలో కలుపుకుని తాగవచ్చు. ఈ గింజలు తీసుకోవడంతో పాటు వ్యాయామం, సమతుల ఆహారం తీసుకోవడం తప్పనిసరి. 
 
ఇలా చేయడం వల్ల పీరియడ్స్ క్రమం తప్పకుండా వస్తాయి. జుట్టు ఆరోగ్యంగా వుంటుంది. అధిక బరువు తగ్గుతారు. పీరియడ్స్ ముందు వచ్చే అనారోగ్యం తగ్గుతుంది. సంతానలేమి, మెనోపాజ్ లో వున్నవారు, గర్భసంచి తొలగించినవారు కూడా గింజలు తీసుకోవడం వల్ల ప్రయోజనం వుంటుంది.

అన్నీ చూడండి

తెలిసినవారితో తెలుగు అమ్మాయిలు జాగ్రత్త, 80 శాతం లైంగిక దాడులకు వీళ్లే కారకులు, రిపోర్ట్

Rahul Gandhi: జంతర్ మంతర్ వద్ద రాహుల్ గాంధీ.. ఎత్తుకెళ్లిన పోలీసులు

బ్రిటన్‌లో తొలి ఏఐ మంత్రిగా భారతీయుడు

Mysuru: భార్య, ఇద్దరు కుమార్తెల గొంతు నులిమి చంపేసిన భర్త

దారుణం, రెండ్రోజుల వయసున్న ఆడ శిశువును సంచీలో పెట్టి రోడ్డుపక్కన వదిలేసారు

అన్నీ చూడండి

జియోస్టార్, భారతదేశ వ్యాప్తంగా ఆరు బిగ్ బాస్ ఎడిషన్లు ఒకేచోట

Prabhas: స్పిరిట్ పంపిణీ కోసం పీపుల్ మీడియా, ఏషియన్ సురేష్ భాగస్వామ్యం

Priyadarshi: ఈ కథ విన్నప్పుడు మా అమ్మ గుర్తొచ్చింది : ప్రియదర్శి

Vijay: ఒకేలా బతకడానికి ఇంత పెద్ద జన్మ ఎందుకు? అనేది నాకు స్పూర్తి : వెంకట్ కె. నారాయణ

సోనమ్ రఘువంశీ ప్రవర్తనపై ప్రశ్నాస్త్రాలను సంధించిన సుప్రీం కోర్టు

తర్వాతి కథనం
Show comments