బఠాణీలు రంగుమారకుండా ఉండాలంటే?

ఎండబెట్టిన అల్లంపొట్టును, ఇలాచి పొట్టు టీ పొడిలో కలుపుకుంటే టీకి మరింత రుచివస్తుంది. గారెల పిండి రుబ్బేటపుడు అందులో కొద్దిగా అన్నం వేసి రుబ్బితే గారెలు కరకరలాడుతాయి. బియ్యంలో మట్టిగడ్డలు ఎక్కువగా ఉంటే కొంచెం ఉప్పును వేసి 10 నిమిషాలు నాననిస్తే మట్టి గ

శుక్రవారం, 1 జూన్ 2018 (12:26 IST)
ఎండబెట్టిన అల్లంపొట్టును, ఇలాచి పొట్టు టీ పొడిలో కలుపుకుంటే టీకి మరింత రుచివస్తుంది. గారెల పిండి రుబ్బేటపుడు అందులో కొద్దిగా అన్నం వేసి రుబ్బితే గారెలు కరకరలాడుతాయి. బియ్యంలో మట్టిగడ్డలు ఎక్కువగా ఉంటే కొంచెం ఉప్పును వేసి 10 నిమిషాలు నాననిస్తే మట్టి గడ్డలు నీళ్ళలో కరిగిపోతాయి. చపాతీ పిండిని కలిపేటప్పుడు అందులో గోరువెచ్చని నీళ్ళు వాడితే చపాతీలు సాఫ్ట్‌గా వస్తాయి.
 
బియ్యంలో పురుగు పట్టకుండా ఉండాలంటే ఆ డబ్బాల్లో కొన్ని కరివేపాకు ఆకులు ఉంచితేచాలు. దోస, పకోడీ లేక జంతికలు కరకరలాడాలంటే వాటిల్లో కొన్ని పాలువేసి కలపాలి. రాగివస్తువులను చింతపండుతో తోమితే అవి బాగా మెరుస్థాయి. బెండకాయలు ఫ్రెష్‌గా ఉండాలంటే వాటి కొనలు తుంటి ప్లాస్టిక్ కవర్లో ఉంచితేచాలు.
 
ఇత్తడి వస్తువులను ముందు ఉప్పునీటితో తోమి ఆ తరువాత మామూలు నీటితో తోమితే బాగా మెరుస్తాయి. వంకాయ ముక్కలు వేసిన నీళ్ళలో రెండు చెంచాల పాలు కలిపితే అవి నల్లగామారవు. కందిపప్పు డబ్బాలో ఎండుకొబ్బరి చిప్పను ఉంచితే పురుగులు పట్టువు. అల్లం ఎక్కువరోజులు నిల్వఉండాలంటే వాటిని తడివస్త్రంలో చుట్టిపెట్టాలి.
 
బెండకాయల జిరుగు తగ్గాలంటే వాటిల్లో కొద్దిగా మజ్జిగ, పెరుగు లేదా నిమ్మరసం వేస్తె జిరుగు తగ్గుతుంది. పచ్చిమిరపకాయలకు గాట్లు వేయించితే అవి పగలవు. బఠాణీలు ఉడికించేటప్పుడు అందులో కొద్దిగా చెక్కర వేస్తె రంగుమారవు. కాలిఫ్లవర్ తరిగిన తరువాత ఉప్పు లేదా వెనిగర్ వేసిన నీటిలో కడిగితే పురుగులు దూరమవుతాయి.
 
గోబిపువ్వు వండేటప్పుడు ఒక చెంచాడు పాలు వేస్తే తెల్లదనం పోదు. బియ్యం కడిగిన నీళ్ళలో తరిగిన పచ్చిఅరటికాయ ముక్కలను 2 నిమిషాల పాటు ఉంచితే నల్లబడవు. నెయ్యి త్వరగా పేరుకుపోకుండా ఉండాలంటే మీగడ కట్టేటప్పుడు కొద్దిగా నీళ్ళు చల్లాలి. ఉడుకుతున్న బంగాలదుంపల రంగు మారకుండా ఉండాలంటే అందులో రెండుచుక్కల నిమ్మరసం వేస్తే మంచిది.

అన్నీ చూడండి

నీటి హైసింత్ వల్ల ప్రభావితమైన నీటి వనరులు.. మహిళలకు జీవనోపాధి.. ఎలా?

తెలంగాణలో నో ఎబోలా.. విమానాశ్రయం, ఆస్పత్రుల్లో కట్టుదిట్టమైన నిఘా

కదిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి గోపురంపై పిడుగు.. తిరుమలలో భారీ వర్షాలు

నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం.. 20 ఏళ్ల యువకుడికి 20 జైలు శిక్ష

జూలై 5న భోగాపురం ఎయిర్ పోర్టు ప్రారంభానికి సన్నాహాలు

అన్నీ చూడండి

'దేశీ ప్రిన్సెస్‌'లా మెరిసిపోతున్న జాన్వీ కపూర్

Nani: 150 మిలియన్+ వ్యూస్ తో నాని ది ప్యారడైజ్ ఆయా షేర్ సాంగ్

Devi Sri Prasad: ఎల్లమ్మ చేయడానికి స్ఫూర్తిని ఇచ్చిన గ్రామం వెదురుపాక: దేవిశ్రీ ప్రసాద్

Karthi: ఈ ఏడాది చిత్రాల సందడితో 49వ పుట్టినరోజు జరుపుకుంటున్న కార్తి

కెమెరాతో కథ చెప్పాలి, రీ-రికార్డింగ్‌కి కూడా కథలో స్పేస్ ఉండాలి : కెమెరామెన్ రత్నవేలు

తర్వాతి కథనం
Show comments