Webdunia - Bharat's app for daily news and videos

Install App

బఠాణీలు రంగుమారకుండా ఉండాలంటే?

ఎండబెట్టిన అల్లంపొట్టును, ఇలాచి పొట్టు టీ పొడిలో కలుపుకుంటే టీకి మరింత రుచివస్తుంది. గారెల పిండి రుబ్బేటపుడు అందులో కొద్దిగా అన్నం వేసి రుబ్బితే గారెలు కరకరలాడుతాయి. బియ్యంలో మట్టిగడ్డలు ఎక్కువగా ఉంటే కొంచెం ఉప్పును వేసి 10 నిమిషాలు నాననిస్తే మట్టి గ

Written By Kowsalya
Updated: శుక్రవారం, 1 జూన్ 2018 (15:55 IST)
ఎండబెట్టిన అల్లంపొట్టును, ఇలాచి పొట్టు టీ పొడిలో కలుపుకుంటే టీకి మరింత రుచివస్తుంది. గారెల పిండి రుబ్బేటపుడు అందులో కొద్దిగా అన్నం వేసి రుబ్బితే గారెలు కరకరలాడుతాయి. బియ్యంలో మట్టిగడ్డలు ఎక్కువగా ఉంటే కొంచెం ఉప్పును వేసి 10 నిమిషాలు నాననిస్తే మట్టి గడ్డలు నీళ్ళలో కరిగిపోతాయి. చపాతీ పిండిని కలిపేటప్పుడు అందులో గోరువెచ్చని నీళ్ళు వాడితే చపాతీలు సాఫ్ట్‌గా వస్తాయి.
 
బియ్యంలో పురుగు పట్టకుండా ఉండాలంటే ఆ డబ్బాల్లో కొన్ని కరివేపాకు ఆకులు ఉంచితేచాలు. దోస, పకోడీ లేక జంతికలు కరకరలాడాలంటే వాటిల్లో కొన్ని పాలువేసి కలపాలి. రాగివస్తువులను చింతపండుతో తోమితే అవి బాగా మెరుస్థాయి. బెండకాయలు ఫ్రెష్‌గా ఉండాలంటే వాటి కొనలు తుంటి ప్లాస్టిక్ కవర్లో ఉంచితేచాలు.
 
ఇత్తడి వస్తువులను ముందు ఉప్పునీటితో తోమి ఆ తరువాత మామూలు నీటితో తోమితే బాగా మెరుస్తాయి. వంకాయ ముక్కలు వేసిన నీళ్ళలో రెండు చెంచాల పాలు కలిపితే అవి నల్లగామారవు. కందిపప్పు డబ్బాలో ఎండుకొబ్బరి చిప్పను ఉంచితే పురుగులు పట్టువు. అల్లం ఎక్కువరోజులు నిల్వఉండాలంటే వాటిని తడివస్త్రంలో చుట్టిపెట్టాలి.
 
బెండకాయల జిరుగు తగ్గాలంటే వాటిల్లో కొద్దిగా మజ్జిగ, పెరుగు లేదా నిమ్మరసం వేస్తె జిరుగు తగ్గుతుంది. పచ్చిమిరపకాయలకు గాట్లు వేయించితే అవి పగలవు. బఠాణీలు ఉడికించేటప్పుడు అందులో కొద్దిగా చెక్కర వేస్తె రంగుమారవు. కాలిఫ్లవర్ తరిగిన తరువాత ఉప్పు లేదా వెనిగర్ వేసిన నీటిలో కడిగితే పురుగులు దూరమవుతాయి.
 
గోబిపువ్వు వండేటప్పుడు ఒక చెంచాడు పాలు వేస్తే తెల్లదనం పోదు. బియ్యం కడిగిన నీళ్ళలో తరిగిన పచ్చిఅరటికాయ ముక్కలను 2 నిమిషాల పాటు ఉంచితే నల్లబడవు. నెయ్యి త్వరగా పేరుకుపోకుండా ఉండాలంటే మీగడ కట్టేటప్పుడు కొద్దిగా నీళ్ళు చల్లాలి. ఉడుకుతున్న బంగాలదుంపల రంగు మారకుండా ఉండాలంటే అందులో రెండుచుక్కల నిమ్మరసం వేస్తే మంచిది.
About Author
Kowsalya
దేవీ (మురళీకృష్ణ)  నిక్‌నేమ్- శక్తిమాన్ సినిమా రంగంలో దాదాపు 26 ఏళ్ల అనుభవం ఉంది. కళారంగంపై ఇంట్రెస్టుతో రిపోర్టర్‌గా కెరీర్ మొదలైంది. అలా చేస్తూనే విజయవాడలో రంగస్థలంపై నాటకాల్లో పాత్రలు పోషించారు. అలా ఆర్టిస్టుగా.. పలు సినిమాలు, సీరియల్స్‌లో సైతం నటించారు. స్క్రిప్ట్ వర్క్‌లో కూడా కొద్దికాలం చేశారు. అలా ప్రజాశక్తి దినపత్రికలో సినిమా పేజీ న్యూస్ రిపోర్టర్‌గా తనతోనే ఆరంభం అయింది. అలా చేస్తుండగానే మెగాస్టార్ చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేశాక...... Read More

అన్నీ చూడండి

బాలిక మిస్సింగ్ కేసు : గుంటూరు పోలీసులు చాలా గ్రేట్ అంటూ హైకోర్టు వ్యంగ్యాస్త్రాలు

హస్తినలో కొండా సురేఖకు నిరాశ - వేటు పడటమే తరువాయి?

September 03, 2026: గురువారం నాటి తెలుగు రాష్ట్రాల వాతావరణం ఎలా వుందంటే?

పవన్ కల్యాణ్ ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తూ షాక్ తగిలి మృతి చెందిన అభిమాని ఫ్యామిలీకి రూ. 5 లక్షల సాయం

ఉజ్జయిని శ్మశానంలో లేడీ అఘోరి అరాచకాలు, అరెస్ట్ చేసిన పోలీసులు

అన్నీ చూడండి

దర్శకుడు సాయి రాజేష్ ఆవిష్కరించిన డియర్ హార్ట్ మోషన్ పోస్టర్

రూ.200 కోట్ల క్లబ్‌లో రవితేజ 'ఇరుముడి' చిత్రం

ఆది సాయికుమార్ క్లాప్ తో ప్రారంభమైన ఇ.ఎం.ఐ. చిత్రం

ఇరుముడి లాంటి విజయం దశాబ్దానికి ఒకసారి వస్తుంది : నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్

Sumanth Prabhas :మన ఫ్యాన్ బాయ్ అనే ప్రేమ ప్రభాస్‌లో కనిపించింది : సుమంత్ ప్రభాస్

తర్వాతి కథనం
Show comments