సీసపు గోళి గొంతులో ఇరుక్కుపోయింది.. బాలుడి మృతి

ఆదివారం, 23 ఫిబ్రవరి 2020 (17:24 IST)
మొన్నటికి మొన్న సపోటా పండు ప్రాణాలపైకి వచ్చిన వార్త వెలుగులోకి వచ్చింది. తాజాగా ఓ చిన్నారిని గోళి బలి తీసుకుంది. సీసపు గోళి గొంతులో ఇరుక్కుపోయి ఓ చిన్నారి మృతి చెందాడు. ఈ విషాదకర ఘటన శనివారం జగిత్యాల జిల్లా కోరుట్లలోని పోచమ్మ వీధిలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. కోరుట్ల రవిరాజు మేడిపల్లి మండలం దమ్మన్నపేట గ్రామంలో పంచాయతీ సెక్రటరీగా పని చేస్తున్నాడు. శనివారం కొడుకు అభియంత్(11 నెలలు) ఇంటి ఆవరణలో పిల్లలతో ఆడుకుంటూ ప్రమాదవశాత్తు సీసపు గోళి మింగేశాడు. 
 
అది గొంతులో ఇరుక్కుపోయింది. ఇంకా ఊపిరాడలేదు. వెంటనే సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం జగిత్యాల తీసుకువెళ్లారు. అప్పటికే బాలుడు చనిపోయినట్లు వైద్యులు తెలిపారు.

అన్నీ చూడండి

Nivetha Pethuraj: వెంకీ, చిరు సినిమాల్లో ఛాన్స్ కొట్టేసిన నివేదా పేతురాజ్

Madhura Sridhar: అలా చేయడంతో ఇండస్ట్రీ పరువు పోతుంది : మధుర శ్రీధర్ రెడ్డి

సందిగ్ధం విజయం సాధించాలని కోరుకుంటున్నా : తమ్మారెడ్డి భరద్వాజ్

Srikanth: మిడిల్ క్లాస్ కుటుంబాలందరికీ కనెక్ట్ అయ్యే మిస్టర్ మిడిల్ క్లాస్ :శ్రీకాంత్

Dil Raju: కథా బలమున్న చిల్డ్రన్ ఫిలిం సమ్మర్ హాలిడేస్ ఎంటర్ టైన్ చేయాలి : దిల్ రాజు

తర్వాతి కథనం
Show comments