Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమూల్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా సీఎం జగన్ : అచ్చెన్నాయుడు

Written By ఠాగూర్
Updated: బుధవారం, 5 మే 2021 (14:29 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్‌మోహన్‌ రెడ్డిపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అమూల్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా జగన్ రెడ్డి అని ఆరోపించారు.
 
ఏపీ డైయిరీకి చెందిన ఆస్తులను అమూల్‌కు కట్టబెట్టడంలోనే కుట్ర బహిర్గతమైందని తెలిపారు. గుజరాత్ సంస్థ కోసం సంగం డైరీ రైతులను బలి తీసుకున్నారని మండిపడ్డారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, గుజరాత్ రాష్ట్రానికి చెందిన అమూల్ డైరికి ఏపీ డైరీ ఆస్తులను ఒక యేడాది పాటుకు ఇస్తూ ఏపీ మంత్రివర్గం నిర్ణయం తీసుకున్న విషయం తెల్సిందే. 
 
దీనిపై అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, తెలుగు భాషపై, తెలుగువారి డైయిరీపై ముఖ్యమంత్రికి నమ్మకం లేదా అని ప్రశ్నించారు. ఏపీలో డైయిరీలను చంపేందుకు జగన్ రెడ్డి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. అమూల్‌కు పాలు రాకపోవడంతో కక్షగట్టారన్నారు. 
 
బాగా నడుస్తున్న వ్యవస్థను విధ్వంసం చేయడం ఏవిధంగా న్యాయమని నిలదీశారు. అమూల్‌కు పాలుపోస్తేనే సంక్షేమ పథకాలంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతలపై కక్ష సాధింపుల కోసం డెయిరీ రంగాన్నే నిర్వీర్యం చేస్తున్నారని అచ్చెన్నాయుడు విమర్శించారు. 

అన్నీ చూడండి

Toxic: trailer: బోల్డ్, రా, వైల్డ్, క్రేజీ, అంశాలతో యష్..కియారా అద్వానీ చిత్రం టాక్సిక్: ట్రైలర్

Allari Naresh: కీలక సన్నివేశాల చిత్రీకరణలో రంభ ఊర్వశి మేనక

తొలిరోజే రూ.10.2 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన కొరియన్ కనకరాజు

హీరోకి బాక్సాఫీస్ నంబర్లే ముఖ్యం. అగధ తో నేనూ ఆశిస్తున్నా: శ్రవణ్ రెడ్డి

డెంగ్యూ బారిన పడిన సినీ నటి అవికా గోర్.. భర్త ఏమన్నారంటే? (video)

తర్వాతి కథనం
Show comments