లోకేష్‌కు పరిజ్ఞానం లేదు, చంద్రబాబు దగ్గర నేర్చుకుంటే మంచిది: బొత్స

శనివారం, 17 అక్టోబరు 2020 (16:36 IST)
వరద నష్టంపై నారా లోకేశ్ అంటున్న మాటల్లో వాస్తవాలు లేదని మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. భారీ వర్షాల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా 8 వేల ఇళ్లు నీట మునిగాయని, 14 మంది ప్రాణాలు కోల్పోయారని, దీనికి ప్రధాన కారణం వైసీపీ ప్రభుత్వమేనని టీడీపీ నేత నారా లోకేశ్ ఆరోపించిన సంగతి తెలిసిందే.
 
భారీ ఎత్తున నష్టం జరిగిందని ముఖ్యమంత్రి జగన్ ప్యాలెస్ నుంచి బయటకు వచ్చి వాస్తవ పరిస్థితిని చూడాలని అన్నారు. ఈ నేపథ్యంలో మంత్రి బొత్స సత్యనా రాయణ స్పందిస్తూ లోకేశ్ పైన మండిపడ్డారు. నారా లోకేశ్‌కు ఇంకా పరిజ్ఞానం రాలేదని బొత్స ఎద్దేవా చేశారు.
 
వర్షాలు తగ్గకుండానే నష్టాన్ని ఎలా అంచనా వేస్తారని ప్రశ్నించారు. ఆయనకు తెలియకపోతే ఆయన తండ్రిని అడిగి తెలుసుకోవాలని అన్నారు. వర్షాలు తగ్గిన తర్వాత నష్టాన్ని అంచనా వేసి తదుపరి చర్యలు తీసుకుంటామని బొత్స తెలిపారు.

అన్నీ చూడండి

Nivetha Pethuraj: వెంకీ, చిరు సినిమాల్లో ఛాన్స్ కొట్టేసిన నివేదా పేతురాజ్

Madhura Sridhar: అలా చేయడంతో ఇండస్ట్రీ పరువు పోతుంది : మధుర శ్రీధర్ రెడ్డి

సందిగ్ధం విజయం సాధించాలని కోరుకుంటున్నా : తమ్మారెడ్డి భరద్వాజ్

Srikanth: మిడిల్ క్లాస్ కుటుంబాలందరికీ కనెక్ట్ అయ్యే మిస్టర్ మిడిల్ క్లాస్ :శ్రీకాంత్

Dil Raju: కథా బలమున్న చిల్డ్రన్ ఫిలిం సమ్మర్ హాలిడేస్ ఎంటర్ టైన్ చేయాలి : దిల్ రాజు

తర్వాతి కథనం
Show comments