ఏపీలో ఆర్టీసీ సిబ్బందికి కరోనా దెబ్బ

బుధవారం, 5 ఆగస్టు 2020 (09:26 IST)
ఏపీలో ఆర్టీసీని కరోనా వణికిస్తోంది. ఆ సంస్థకు చెందిన వందలాది మంది ఉద్యోగులు కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటి వరకూ రాష్ట్రవ్యాప్తంగా 1187 మంది కొవిడ్‌ బారిన పడినట్లు, 18 మంది మృతి చెందినట్లు అధికారులు చెబుతున్నారు.

కరోనా విజృంభణ నేపథ్యంలో ప్రజా రవాణా ప్రారంభం కాగానే ఈయూ, ఎన్‌ఎంయూ, ఎస్‌డబ్ల్యూఎఫ్‌ కార్మిక సంఘాలు యాజమాన్యానికి, ప్రభుత్వానికి కొన్ని వినతులిచ్చాయి. సిబ్బందికి కొవిడ్‌ వస్తే మెరుగైన వైద్యం అందించాలని, ఎవరైనా మరణిస్తే 50లక్షల బీమా వర్తింపజేయాలని కోరాయి.

అందుకు అనుగుణంగా జూలై 15న ఆర్టీసీ యాజమాన్యం అన్ని డిపోల మేనేజర్లు, ఆర్‌ఎంలు, ఈడీలకు సర్క్యులర్‌ జారీ చేసింది. పీటీడీ సిబ్బంది ఎవరికి కరోనా సోకినా రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఎంపిక చేసిన అన్ని రెఫరల్‌ ఆసుపత్రుల్లో సూపర్‌ స్పెషాలిటీ వైద్యం అందించాలని ఆదేశించింది.

అన్నీ చూడండి

జియోస్టార్, భారతదేశ వ్యాప్తంగా ఆరు బిగ్ బాస్ ఎడిషన్లు ఒకేచోట

Prabhas: స్పిరిట్ పంపిణీ కోసం పీపుల్ మీడియా, ఏషియన్ సురేష్ భాగస్వామ్యం

Priyadarshi: ఈ కథ విన్నప్పుడు మా అమ్మ గుర్తొచ్చింది : ప్రియదర్శి

Vijay: ఒకేలా బతకడానికి ఇంత పెద్ద జన్మ ఎందుకు? అనేది నాకు స్పూర్తి : వెంకట్ కె. నారాయణ

సోనమ్ రఘువంశీ ప్రవర్తనపై ప్రశ్నాస్త్రాలను సంధించిన సుప్రీం కోర్టు

తర్వాతి కథనం
Show comments