ఏపీకి చేరుకున్న కోవిషీల్డ్ వ్యాక్సిన్లు

గురువారం, 3 జూన్ 2021 (11:59 IST)
కోవిషీల్డ్ వ్యాక్సిన్ డోసులు గురువారం ఉదయం గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకున్నాయి. సీరం ఇనిస్టిట్యూట్ నుండి దాదాపు మూడు లక్షల అరవై వేల డోసులు రాష్ట్రానికి వచ్చాయి. వ్యాక్సిన్లను గన్నవరం స్టేట్ వ్యాక్సిన్ స్టోరేజ్‌కు అధికారులు తరలించారు. 
 
కేంద్రం ఆదేశాలతో వైద్య సామాగ్రి రాష్ట్రానికి చేరుకున్నాయి. ఢిల్లీ నుంచి విజయవాడ చేరుకున్న ప్రత్యేక విమానంలో 50 ఆక్సిజన్ సిలెండర్లు, మరో 50 ప్రాణవాయువు సాంద్రత పరికరాలు వచ్చాయి. కరోనా రోగులకు అందించే అత్యవసర చికిత్సలకు వినియోగించుకోవాలని కేంద్రం సూచించింది.

ప్రాణవాయువు పరికరాలతో పాటు చేరుకున్న అత్యవసర వైద్య సామగ్రితో కొవిడ్ సేవల్లో పురోగతి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే సుమారు వంద పైచినుకు వెంటిలేటర్లు, ఇతర వైద్య పరికరాలను కేంద్రం పంపగా... తాజాగా అత్యవసర చికిత్సకు మరికొన్ని చేరాయి.

అన్నీ చూడండి

'దేశీ ప్రిన్సెస్‌'లా మెరిసిపోతున్న జాన్వీ కపూర్

Nani: 150 మిలియన్+ వ్యూస్ తో నాని ది ప్యారడైజ్ ఆయా షేర్ సాంగ్

Devi Sri Prasad: ఎల్లమ్మ చేయడానికి స్ఫూర్తిని ఇచ్చిన గ్రామం వెదురుపాక: దేవిశ్రీ ప్రసాద్

Karthi: ఈ ఏడాది చిత్రాల సందడితో 49వ పుట్టినరోజు జరుపుకుంటున్న కార్తి

కెమెరాతో కథ చెప్పాలి, రీ-రికార్డింగ్‌కి కూడా కథలో స్పేస్ ఉండాలి : కెమెరామెన్ రత్నవేలు

తర్వాతి కథనం
Show comments