ఈసీకి కులాన్ని అంటగట్టడం సిగ్గుచేటు: సీపీఐ

మంగళవారం, 17 మార్చి 2020 (07:33 IST)
ఎన్నికల కమిషనర్‌కు కులాన్ని అంటగట్టడం సిగ్గుచేటని సీపీఐ నేత రామకృష్ణ తప్పుబట్టారు. కరోనా కారణంగా ఎన్నికలు వాయిదా వేయాలని గతంలోనే సీపీఐ కోరిందని గుర్తుచేశారు.

ఎన్నికల్లో మంత్రులు అరాచకంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మాచర్ల, చిత్తూరు ఘటనలు చూసి సీఎం జగన్ సిగ్గుపడాలన్నారు.

టీడీపీ అధినేత చంద్రబాబు నియమించారంటూ ఎస్‌ఈసీపై ఆరోపణలు చేస్తున్నారని, డీజీపీని నువ్వు నియమించావని, ఆయన చేస్తున్న పనులకు నీవు బాధ్యుడివి కాదా? అని జగన్‌ను రామకృష్ణ ప్రశ్నించారు. నీ వల్ల డీజీపీ రెండు సార్లు హైకోర్టు బోనెక్కారని రామకృష్ణ గుర్తుచేశారు.

అన్నీ చూడండి

రామాయణంలో శ్రీరాముడి తొలి లుక్‌కు వెనుక ఉన్న ఆభరణాలను ఆవిష్కరించిన ట్రైబ్ అమ్రపాలి

'ప్రశ్న' రావణ్ మొబైల్ ఫోనులో మావోయిస్టులను కీర్తిస్తూ ప్రసంగాలు

Naga Vamsi: మేం చేయాల్సిన డామేజీ మేం చేస్తాం : నాగ వంశీ

Satyadev :ఎకోలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ గా సమవర్తి నుంచి సత్యదేవ్ లుక్

Aadi: వసుదేవసుతం ఫ్యామిలీ ఎంటర్ టైనర్ : ఆది

తర్వాతి కథనం
Show comments