1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By CVR
Last Updated : సోమవారం, 20 అక్టోబరు 2014 (17:37 IST)

బాణాసంచా పేలుడు ఘటనలో 13 మంది మృతి... పెరిగే అవకాశం

తూర్పు గోదావరి జిల్లా యు. కొత్తపల్లిలో బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించిన ఘటనలో 13 మంది మృతి చెందారు. బాణాసంచా తయారీ సమయంలో ప్రమాదవశాత్తూ పేలుడు సంభవించడంతో అక్కడంతా పెద్దఎత్తున మంటలు వ్యాపించాయి. 
 
ఈ మంటల్లో చిక్కుకున్న కార్మికులు అగ్నికి ఆహుతయ్యారు. కాగా ఈ బాణాసంచా తయారీ కేంద్రానికి ఎలాంటి అనుమతి లేదని, కొంతమంది వ్యక్తులు స్థానికంగా బాణాసంచా తయారు చేస్తూ వుండగా ఈ పేలుడు సంభవించింది.