భోగీలను వదిలేసి ఇంజన్ తో వెళ్లిపోయిన డ్రైవర్

మంగళవారం, 20 ఆగస్టు 2019 (08:18 IST)
తూర్పుగోదావరి జిల్లా తుని రైల్వేస్టేషన్లో విశాఖ ఎక్స్ ప్రెస్ కు పెనుప్రమాదం తప్పింది. విశాఖ వెళ్లాల్సిన ట్రైన్లు తుని రైల్వే స్టేషన్ వద్ద క్రాసింగ్ కావాల్సిఉంటుంది. ఈ నేపథ్యంలో విశాఖ ఎక్స్ ప్రెస్ డ్రైవర్ భోగీలను వదిలేసి ముందుకు వెళ్లిపోయాడు. సుమారు పది కిలోమీటర్ల మేర డ్రైవర్ ఇంజన్ తో వెళ్లిపోయాడు. 
 
భోగీలను వదిలేసి వెళ్లిపోవడంతో ప్రయాణికులు ఆందోళన చెందారు. భయంతో కేకలు వేశారు. మధ్యలో నిలిచిపోవడంతో ఎటువైపు నుంచి ట్రైన్ వస్తుందోనని తెలియక టెన్షన్ పడ్డారు. రైల్వేస్టేషన్లో ప్రయాణికులు ఫిర్యాదు చేశారు. 
 
దాంతో భోగీలు వదిలి వెళ్లిపోయిన డ్రైవర్ వెనక్కి వచ్చాడు. దాంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. సుమారు 20 నిమిషాల పాటు ఇంజన్ రాకపోవడంతో తమ పరిస్థితి ఏంటా అని ఆందోళన చెందారు ప్రయాణికులు. డ్రైవర్ వచ్చి భోగీలకు ఇంజిన్ అమర్చి యదావిధిగా తీసుకెళ్లాడు.

అయితే ఎలాంటి ప్రమాదం సంభవించకపోవడంతో అంతా హమ్మయా అంటూ ఊపిరిపీల్చుకున్నారు.

అన్నీ చూడండి

Vishal: సీఎం విజయ్ చెప్పినట్లు చేశానంటున్న విశాల్

యూట్యూబర్ ఖలీద్‌తో బ్రేకప్ చెప్పేసిన నటి సునైనా?

Peddi Article: పెద్ది కలెక్లన్ల ద్వారా తెలుగు ఇంఢస్ట్రీ ఏం నేర్చుకుంది? ఇంకా ఏం నేర్చుకోవాలి?

శ్రీనగర్ యువతిని పెళ్లాడిన ఊర్మిళా మాటోండ్కర్ మాజీ భర్త

Samantha: హిట్లతో అహంకారం పెరిగింది, రిటైర్మెంట్ ఆలోచించలేదు : సమంత ప్రభు

తర్వాతి కథనం
Show comments