అంతర్వేది రథం దగ్ధం ఘటనతో అప్రమత్తమైన పోలీసులు ఆలయాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. రాష్ట్రంలోని దేవాలయాలు, ఇతర ప్రార్థన మందిరాలకు జియో ట్యాగింగ్ చేయాలని అన్ని జిల్లాల ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులను డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆదేశించారు.