Webdunia - Bharat's app for daily news and videos

Install App

5, 6 తేదీలలో జనసేన మేధోమధనం

Written By ఎం
Updated: మంగళవారం, 3 సెప్టెంబరు 2019 (18:54 IST)
జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశాలు ఈ నెల 5, 6 వ తేదీలలో తూర్పుగోదావరి జిల్లా రాజోలు సమీపంలోని దిండి గ్రామంలో జరగనున్నాయి.

పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఈ సమావేశాలలో పాల్గొంటారు. ఈ సందర్భంగా పార్టీ సీనియర్ నేతలు, యువ నాయకులతో వివిధ అంశాలపై మేధోమధనం జరుగనుంది.

గతంలో రాజకీయాలు-ఇప్పటి రాజకీయాలు, వ్యవసాయరంగం, సభలు-సమావేశాలు-చర్చ కార్యక్రమాలలో పార్టీ వాణిని సమర్ధంగా వినిపించడం, సమాచార హక్కు, న్యాయ-ధర్మ సూత్రాలు, పౌర పాలన, స్థానిక స్వపరిపాలన వంటి అంశాలపై అవలోకనం, అవగాహనా సమావేశాలు జరుగుతాయి.

వివిధ అంశాలలో నిపుణులయిన వారు ఈ మేధోమధనంలో పాల్గొంటారు. రాజకీయవ్యవహారాల కమిటీ (పి.ఏ.సి.) చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు, పి.ఏ.సి.సభ్యులు నాలుగో తేదీ సాయంత్రానికే దిండి చేరుకుంటారు.

అన్నీ చూడండి

Suriya: సైకో పోలీస్ ఆఫీసర్‌గా సీన్ గ్లింప్స్ తో ఆకట్టుకున్న సూర్య

Dulquer Salmaan : ఆకాశంలో ఒకతార గా ఎదగాలనే కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్

Ranabali date: అక్టోబర్ 16న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రణబాలి మూవీ

Namit Malhotra: రామాయణ నుండి భారీ అప్‌డేట్ ప్రకటించిన నమిత్ మల్హోత్రా

Raka 37: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాకా 37 పోస్టర్ తో క్రేజ్

తర్వాతి కథనం
Show comments