Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాకినాడలో ప్రేమజంట మృతి.. రైల్వే ట్రాక్ వద్ద ప్రేయసిని ప్రియుడు హత్య చేశాడా?

Written By సెల్వి
Updated: బుధవారం, 1 అక్టోబరు 2025 (19:52 IST)
ప్రేమజంట మృతి కాకినాడలో సంచలనం సృష్టిస్తోంది. సామర్లకోట మండలం, పనసపాడులో ఈ ఘటన వెలుగు చూసింది. యువతి మృతదేహం పనసపాడు శివారులోని ఆలయం వద్ద లభ్యమవగా.. ఆమె ఒంటిపై గాయాలు, కత్తిపోట్లతో గల మృత దేహాన్ని పోలీసులు గుర్తించారు. 
 
యువకుడి మృతదేహాం హుస్సేన్‌పురం రైల్వే ట్రాక్ దగ్గర లభ్యమైంది. మృతులను గొల్లప్రోలు మండలం దుర్గాడ గ్రామానికి చెందిన దీప్తి, అశోక్‌గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని వివిధ కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నారు. 
 
ఈ జంట మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తుందా అన్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మృతుడు ఆశోక్ పై కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 
 
ముందుగా అశోక్ ప్రియురాలు దీప్తి  గొంతుకోసి.. ఆ తర్వాత తాను రైలు పట్టాల కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడా? అనే కోణంలో కూడా విచారిస్తున్నారు పోలీసులు. దీప్తి స్థానికంగా ఉన్న కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతుండగా... అశోక్ చెన్నైలో ఏదో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు.

అన్నీ చూడండి

Toxic: trailer: బోల్డ్, రా, వైల్డ్, క్రేజీ, అంశాలతో యష్..కియారా అద్వానీ చిత్రం టాక్సిక్: ట్రైలర్

Allari Naresh: కీలక సన్నివేశాల చిత్రీకరణలో రంభ ఊర్వశి మేనక

తొలిరోజే రూ.10.2 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన కొరియన్ కనకరాజు

హీరోకి బాక్సాఫీస్ నంబర్లే ముఖ్యం. అగధ తో నేనూ ఆశిస్తున్నా: శ్రవణ్ రెడ్డి

డెంగ్యూ బారిన పడిన సినీ నటి అవికా గోర్.. భర్త ఏమన్నారంటే? (video)

తర్వాతి కథనం
Show comments