21న అల్పపీడనం

శనివారం, 17 జులై 2021 (08:33 IST)
ఈ నెల 21న వాయువ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.

రాష్ట్రంలో రాగల 48 గంటల్లో రాయలసీమ ప్రాంతంలో కొద్దిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఉత్తర, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలకు అవకాశాలున్నాయని తెలిపారు.

కర్నూలు జిల్లాలో గురువారం రాత్రి మోస్తరు నుంచి తేలికపాటి వర్షం కురిసింది. 47 మండలాల్లో సరాసరిన 10.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

ప్రకాశం, నెల్లూరు, గుంటూరులో భారీ వర్షం కురిసింది. పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రధాన రహదారులపై మురుగునీరు ప్రవహించింది.

అన్నీ చూడండి

Nivetha Pethuraj: వెంకీ, చిరు సినిమాల్లో ఛాన్స్ కొట్టేసిన నివేదా పేతురాజ్

Madhura Sridhar: అలా చేయడంతో ఇండస్ట్రీ పరువు పోతుంది : మధుర శ్రీధర్ రెడ్డి

సందిగ్ధం విజయం సాధించాలని కోరుకుంటున్నా : తమ్మారెడ్డి భరద్వాజ్

Srikanth: మిడిల్ క్లాస్ కుటుంబాలందరికీ కనెక్ట్ అయ్యే మిస్టర్ మిడిల్ క్లాస్ :శ్రీకాంత్

Dil Raju: కథా బలమున్న చిల్డ్రన్ ఫిలిం సమ్మర్ హాలిడేస్ ఎంటర్ టైన్ చేయాలి : దిల్ రాజు

తర్వాతి కథనం
Show comments