ఆకాశానంటుతున్న నిత్యావసరాల ధరలు

గురువారం, 22 ఏప్రియల్ 2021 (10:53 IST)
ఇటీవల కాలంలో నిత్యావసర ధరలు విపరీతంగా పెరగడంతో సామాన్యులకు బతుకు పెను భారంగా మారింది. దీనికి తోడు కరోనా మహమ్మారితో పనులు దొరక్క విలవిలలాడుతున్నారు. గత ఏడాది నిత్యావసరాలు కొంత మేర అందుబాటులో ఉండగా ఈ ఏడు రోజురోజుకు పెరిగిపోతూ కొనలేని పరిస్థితి నెలకొంది.

గత ఏడాది కందిపప్పు రూ. 80 ఉండగా ప్రస్తుతం రూ. 120 ఉంది. సనఫ్లవర్‌ ఆయిల్‌ గత ఏడాది రూ. 100 ఉండగా ప్రస్తుతం రూ. 165, వేరుశనగ విత్తనాలు గతంలో రూ. 80 ఉండగా రూ. 120, ఎండు మిరపకాయలు రూ. 100 ఉండగా ప్రస్తుతం రూ. 180,  మినపప్పు గతంలో రూ. 80 ఉండగా ప్రస్తుతం రూ. 120.

పెసలు గతంలో రూ. 60 ఉండగా ప్రస్తుతం రూ. 120, బెల్లం గతంలో రూ. 40 ఉండగా ప్రస్తుతం రూ. 55, శనగపప్పు గతంలో రూ. 60 ఉండగా ప్రస్తుతం రూ. 80 ఉన్నాయి. వీటికి తోడు పెట్రోలు డీజల్‌, గ్యాస్‌ అను నిత్యం పెరగడం వల్ల వీటి ప్రభావం నిత్యావసరాలపై పడి పేదప్రజల జీవితాలు కడు దుర్భరంగా మారాయి.

అన్నీ చూడండి

ప్రదీప్, మమిత లవ్వులో వున్నారా? పెళ్లి చేసుకోబోతున్నారట!

Victory Venkatesh :అనిల్ రావిపూడి చిత్రం షూటింగ్‌లో జాయిన్ అయిన విక్టరీ వెంకటేష్

Chiru158: హైదరాబాద్‌లో శమెగాస్టార్ చిరంజీవి 158 చిత్రం భారీ యాక్షన్ షెడ్యూల్

మిస్టరీ, సస్పెన్స్ తో వ్యూ: ది పాయింట్ ఆఫ్ వ్యూ టీజర్

Ntr: ఎన్టీఆర్‌కు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో విబేదం ఏమిటి ?

తర్వాతి కథనం
Show comments