గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : గురువారం, 14 ఫిబ్రవరి 2019 (09:08 IST)

షర్మిల, ప్రభాస్‌లపై వీడియోలను అందుకే పోస్టు చేశాం...

వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల, సినీ హీరో ప్రభాస్‌లపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరిగింది. ఇలా నెట్టింట తప్పుడు వార్తలను ప్రచురించి... షర్మిలను ట్రోల్ చేసేలా చేసిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. 


ప్రభాస్, షర్మిలకు లింక్ పెట్టి వార్తలు, వీడియోలు పోస్టు చేస్తే.. ఎన్ని లైక్స్ వస్తాయో చూద్దామని అలా చేశామని నిందితులు వాంగ్మూలం ఇచ్చారు. వీరిద్దరినీ కస్టడీకి తీసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. షర్మిలను రాజకీయంగా దెబ్బతీయాలని, ఆమెతో కక్ష్యతో ఈ పని చేయలేదని నిందితులు తెలిపారు. 
 
ఇంకా కొన్ని నెలల క్రితం తాను ఆరు వీడియోలను పోస్ట్‌ చేసినట్టు నిందితుల్లో ఒకరు వెంకటేష్‌ అంగీకరించగా, తాను రెండురోజుల వ్యవధిలో నాలుగు వీడియోలు మాత్రమే అప్‌ లోడ్‌ చేశానని నవీన్‌ పేర్కొన్నట్లు సమాచారం. దీంతో వీరు అప్‌ లోడ్‌ చేసిన ఫొటోలు, వీడియోల్లో ఉన్న కంటెంట్ ఎక్కడిదన్న విషయమై పోలీసులు కూపీ లాగుతున్నారు.
 
ఇప్పటికే ఈ కేసులో కొన్ని యూట్యూబ్ ఛానెళ్ల ప్రతినిధులకు నోటీసులు జారీ అయ్యారు. రెండు చానెళ్లలో షర్మిల వ్యక్తిగత జీవితంపై 100కు పైగా వీడియోలను పోస్ట్ చేశారని గుర్తించిన సైబర్‌ క్రైమ్‌ పోలీసులు, వారిని వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారు.