సంబంధిత వార్తలు
- Sania Mirza: ఒంటరి తల్లి నా కుమారుడిని పెంచడం చాలా చాలా కష్టం : సానియా మీర్జా (video)
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ 2025: 30 రోజుల పాటు కదలడానికి, కనెక్ట్ అవ్వడానికి ప్రపంచవ్యాప్త ఆహ్వానం
- Amla Navami 2025: అక్షయ నవమి, ఉసిరి నవమి నాడు ఈ పరిహారాలు చేస్తే.. అద్భుత ఫలితం.. ఏంటవి?
- Manchu Manoj : గాంధీకి, బ్రిటీష్ వారికి సవాల్ గా మారిన డేవిడ్ రెడ్డి గా మంచు మనోజ్
- ముద్దు ముంచేసింది.. డోపింగ్ టెస్టులో పాజిటివ్ అని తేలింది..
Joy Crizildaa: నీకు దమ్ముంటే డీఎన్ఏ టెస్టుకు రావయ్యా.. మాదంపట్టికి జాయ్ సవాల్
madhampatty rangaraj
వీరి వివాహం సింపుల్గా ఓ ఆలయంలో జరిగింది. దీంతో వీరిద్దరూ భార్యాభర్తలుగా రెండేళ్ల పాటు జీవనం సాగించారు. ప్రస్తుతం జాయ్ ఆరు నెలల గర్భవతి. అయితే పెళ్లి విషయాన్ని జూలై వెల్లడించిన జాయ్.. తాను గర్భవతిగా వున్నాననే విషయాన్ని కూడా డిక్లేర్ చేసింది.
దీంతో మాదంపట్టిపై అభిమానులకు వున్న పరువు గంగలో కలిసిపోయింది. వీరిద్దరి మధ్య విబేధాలున్నట్లు.. మాదంపట్టి తనను పెళ్లి చేసుకుని గర్భవతిని చేసి పారిపోయాడని జాయ్ ఆరోపించారు. దీనిపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. మూడుసార్లు తనకు అబార్షన్ చేయించాడని.. నాలుగోసారి కూడా చేయిస్తే తనకు ఆరోగ్య పరంగా ఇబ్బంది ఏర్పడుతుందని వైద్యులు తెలిపారని జాయ్ వెల్లడించారు.
దీంతో మాదంపట్టి విచారణకు కూడా హాజరయ్యారు. ఈ విచారణ సందర్భంగా మాదంపట్టి జాయ్తో సంబంధాలు నిజమేనని, ఆమె కడుపులో వున్న బిడ్డకు తాను తండ్రినని ఒప్పుకున్నట్లు జాయ్ సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టారు. ఈ పోస్టును మాదం పట్టి ఖండించారు.
ఇంకా డీఎన్ఏ టెస్టుకు సిద్ధమని ప్రకటించారు. ఈ నేపథ్యంలో జాయ్ క్రిస్టిల్డా ఇన్స్టాలో ఓ పోస్టు పెట్టారు. ఈ పోస్టు వైరల్ అవుతోంది. ఈ పోస్టులో మాదంపట్టి డీఎన్ఏ టెస్టుకు సిద్ధమని 15 రోజులైంది.
ఎక్కడికో పారిపోయాడు. మాదంపట్టికి ధైర్యం వుంటే డీఎన్ఏ టెస్టుకు రావాలని సవాలు విసిరారు. ఈ సందర్భంగా మాదంపట్టితో తీసుకున్న ఫోటోను కూడా జాయ్ షేర్ చేసింది.
