Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేసీఆర్ ఫామ్ హౌస్‌లో కోట్లు వున్నాయని చెప్తే.. 100 నిమిషాల్లో? శివాజీ

Updated: శుక్రవారం, 22 మార్చి 2019 (12:36 IST)
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్‌ హౌస్‌లో కోట్లు ఉన్నాయని ఒకవేళ తాను చెబితే.. వంద నిమిషాల్లో అక్కడకు వెళ్లి.. వారి ఫామ్ హౌస్‌లో సోదాలు చేస్తారా అని హీరో శివాజీ అన్నారు. ఒక్క కేసీఆరే కాదు.. ఏపీ సీఎం చంద్రబాబు, వైకాపా చీఫ్ జగన్ రెడ్డి ఇంట్లోనే సోదాలు చేయాలన్నారు. ఈ పరిస్థితి ఏపీలో తప్ప మరే రాష్ట్రంలో లేదు. 
 
ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి సోదాలు లేవు. రాష్ట్ర ఎన్నికల సంఘానికి దీనితో సంబంధం లేదు. ఏపీలో అలజడి సృష్టించేందుకే ఇలాంటివి చేస్తున్నారని శివాజీ చెప్పారు. ఢిల్లీ నుంచి వచ్చిన ఆదేశాల మేరకే రాష్ట్రంలో ఐటీ, జీఎస్టీ దాడులు జరుగుతున్నాయని అన్నారు. బ్యాంకుల నుంచి తగిన ఆధారాలతో డబ్బులు తీసుకెళ్తున్నా... సీజ్ చేస్తున్నారని హీరో శివాజీ ఆవేదన వ్యక్తం చేశారు. 
 
ఐటీ, జీఎస్టీ దాడులతో బెంబేలెత్తిస్తున్నారని శివాజీ మండిపడ్డారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారి ద్వివేదీని కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ దాడులు తమ పరిధిలో లేవని, కేంద్ర ఎన్నికల సంఘం పరిధిలో ఉన్నాయని ద్వివేదీ తనకు చెప్పారని వెల్లడించారు. 

అన్నీ చూడండి

రోహిత్‌ను త్రిగుణ్ వేధిస్తున్నాడు: మద్దతుగా నిలిచిన డెమోన్ పవన్

Dhruv Vikram: రమేష్ వర్మతో ద్విభాషా యాక్షన్ చిత్రంగా ధ్రువ్ విక్రమ్ షూట్

Trivikram Srinivas: ఆదర్శ కుటుంబం – AK47 టీజర్ వచ్చేసింది

Ram-Lakshman: మా అబ్బాయికి జడలు వేయించి యాక్షన్ చేయించాం : రామ్-లక్ష్మణ్

Deepti Ghanta: నితిన్, దీప్తి గంట చిత్రం అలియాస్ రుక్మిణీ ఫస్ట్ షెడ్యూల్ పూర్తి

తర్వాతి కథనం
Show comments