Webdunia - Bharat's app for daily news and videos

Install App

విద్యార్థుల భవిష్యత్తును తీర్చే దిశగా చర్యలు: మంత్రి వనిత

Written By ఎం
Updated: శుక్రవారం, 10 జనవరి 2020 (08:33 IST)
ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యతా ప్రమాణాలతో కూడిన విద్యను అందించి విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తును తీర్చే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర స్త్రీ  శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత అన్నారు.

కొవ్వూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో  జగనన్న అమ్మ ఒడి పథకాన్ని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత ప్రారంభించారు. ఈ సందర్భముగా మంత్రి మాట్లాడుతూ.. పిల్లల చదువులకు ఏ పేదింటి తల్లులు బాధ పడకూడదని, బ్రతుకులు మార్చే గుడి పాఠశాల అని, పాఠశాలలో చదివే పిల్లలకు ఆర్థికంగా ఇబ్బంది పడకూడదని, మన ముఖ్యమంత్రి జగనన్న ప్రవేశపెట్టిన పథకం అమ్మ ఒడి పథకమని అన్నారు.

కష్టపడి చదివించే తల్లులకు, చదివే పిల్లలకు ఈ పథకం ఒక సంజీవని లాంటిదని ఆమె తెలిపారు. కొవ్వూరు నియోజకవర్గంలోని 200 పాఠశాలలు, కాలేజీలలో చదివే విద్యార్థిని విద్యార్థులు సుమారుగా 28,411 మంది ఉంటే వీరిలో 19 వేల ఐదు వందల నలభై మంది లబ్ధి పొందడం జరిగిందని తెలిపారు.

అన్నీ చూడండి

తస్సదియ్యా పాట సమయంలో సమంత ప్రెగ్నెంట్ న్యూస్ వచ్చింది.. మాతృత్వంపై...?

త్రివిక్రమ్ సమర్పణలో బాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ హనుమాన్ అంశ్ రాబోతోంది

బాలికలకు హెచ్ పీవీ వ్యాక్సిన్ పై అవగాహన కల్పించిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్

Vijay Deverakonda: నేను Unhype అనే మంచి స్కిన్ కేర్ వాడుతున్నా: విజయ్ దేవరకొండ

ఎపిక్..ఐదేళ్ల తర్వాత రావాల్సిన సినిమా అంటున్నారు : ఆనంద్ దేవరకొండ

తర్వాతి కథనం
Show comments