ఏపీలోని వైకాపా ప్రభుత్వంపై బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి ఘాటు విమర్శలు ఎక్కుపెట్టారు. అనంతపురం జిల్లా ధర్మవరంలో జరిగిన గాంధీ సంకల్ప యాత్రలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మన దురదృష్టం కొద్దీ ప్రజాస్వామ్య పద్ధతుల్లో వైసీపీ రాజ్యాధికారంలోకి వచ్చింది కనుక, చేయగలిగిందేమీ లేదు కానీ, ప్రజలకు అండగా బీజేపీ ఉందని హామీ ఇచ్చారు.