Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేవుడా, ఆ టిటిడి వసతి సముదాయాలన్నీ కరోనా బాధితుల కోసమే

Written By జె
Updated: బుధవారం, 15 జులై 2020 (22:02 IST)
కరోనా విజృంభిస్తోంది అని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగులకే కరోనా సోకడం.. 91 మందికి అధికారికంగా కరోనా సోకినట్లు స్వయంగా టిటిడి ప్రకటించడం.. ఇక స్థానికుల్లో కూడా కరోనా వైరస్ వ్యాపిస్తుండటం ఇదంతా భక్తులను ఆందోళనకు గురిచేసే అంశంగా చెప్పుకోవాలి.
 
తిరుపతి లాంటి ప్రాంతాల్లో కరోనా బాధితుల కోసం టిటిడి కూడా ముందస్తుగా ఏర్పాట్లు చేసేసుకుంది. భక్తుల కోసం కట్టిన వసతి సముదాయాలను ఏకంగా కరోనా బాధితులకు అందిస్తోంది. ఇప్పటికే టిటిడి ఉద్యోగస్తుల కోసం శ్రీనివాసం, మాధవం లాంటి వసతి గృహాలను కేటాయిస్తే తాజాగా బర్డ్ ఆసుపత్రిని కోవిడ్ బాధితులకు అందించేందుకు సిద్ధమైంది టిటిడి.
 
అంతేకాకుండా విష్ణునివాసంలోని 400 పడకలను కూడా కోవిడ్ బాధితులకే వినియోగించనున్నారు. కలెక్టర్ కోరిక మేరకు టిటిడి వసతి సముదాయాలను కోవిడ్ బాధితులకే అందించేస్తున్నారు. త్వరలోనే ఈ వసతి సముదాయాలన్నీ ప్రభుత్వానికి అందించనున్నారు. భక్తుల కోసం కేటాయించిన వసతి సముదాయాలు కోవిడ్ బాధితులకు ఉపయోగిస్తుండటం సర్వత్రా చర్చకు దారితీస్తోంది. 

అన్నీ చూడండి

King Nagarjuna: నాగార్జున లాంచ్ చేసిన పళ్ళ బురుసు ట్రైలర్

Ranbir Kapoor :బిలియన్ వ్యూస్ దాటి చరిత్ర సృష్టించిన రామాయణ ట్రైలర్

Mithun Chakraborty : కోల్‌కతాలో మిథున్ చక్రవర్తికి శస్త్రచికిత్స, బెంగాల్ సీఎం పరామర్శ

'పెద్ది' చిత్రాన్ని రాం చరణ్ భుజాలపై మోశారు - కానీ, ఆ ఒక్కటీ లోటుంది : పరుచూరి గోపాలకృష్ణ

Paradise teaser: పారడైజన్ జాగా కోసం నాని రక్తపాతం స్రుష్టించిన టీజర్ వచ్చేసింది

తర్వాతి కథనం
Show comments