Biodata Maker

సుగుణమ్మ భ్రష్టుపట్టిస్తున్నారు... బోరున ఏడ్చేసిన తుడా చైర్మన్...

Written By జె
Updated: శనివారం, 23 ఫిబ్రవరి 2019 (20:46 IST)
తిరుపతి టిడిపిలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. ఎన్టీఆర్ గృహకల్ప ఇళ్ళ కేటాయింపులో ఎమ్మెల్యే సుగుణమ్మ, తుడా ఛైర్మన్ నరసింహయాదవ్ మధ్య విభేధాలు బయటపడ్డాయి. తనకు ఇష్టమొచ్చిన వారికి ఎన్టీఆర్ గృహకల్ప కేటాయింపులను ఎమ్మెల్యే చేస్తున్నారని, తాము రెకమెండేషన్ చేసే వారిని పక్కనపెట్టేస్తున్నారని ఆరోపించారు తుడా ఛైర్మన్. 
 
తెలుగుదేశం పార్టీని ఎమ్మెల్యే సుగుణమ్మ భ్రష్టు పట్టిస్తున్నారని, నేతలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదంటూ కంటతడి పెట్టారు. సుగుణమ్మ వ్యవహార శైలితో తుడా ఛైర్మన్ పదవికి, పార్టీకి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నారు తుడా ఛైర్మన్.
 
తనపై నిరాధారమైన ఆరోపణలు తుడా ఛైర్మన్ చేస్తున్నారన్నారు తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ. ముఖ్యమంత్రి ఆదేశాలతోనే ఎన్టీఆర్ గ్రుహ కల్ప ఇళ్ళ కేటాయింపులు జరుగుతున్నాయని, తన వ్యక్తిగతంగా ఎవరికీ ఇళ్ళను కేటాయించడం లేదన్నారు ఎమ్మెల్యే. అయితే గత కొన్నిరోజుల ముందు ఎమ్మెల్యే సీటు కోసం నరసింహ యాదవ్ సిఎంను కలవడం సుగుణమ్మకు ఇష్టం లేదు. దాంతో ఇద్దరి మధ్య విబేధాలు ప్రారంభమైనట్లు ప్రచారంలో ఉంది.

అన్నీ చూడండి

మాతృత్వంలోకి అడుగుపెడుతున్న తరుణంలో శ్రీకల్పం వేడుకను పాటించిన సమంత

ఉన్నట్టుండి ఫ్రేమ్‌లోకి వచ్చిన త్రిష - ముఖం తిప్పేసుకున్న సీఎం విజయ్ (వీడియో)

రోహిత్‌ను త్రిగుణ్ వేధిస్తున్నాడు: మద్దతుగా నిలిచిన డెమోన్ పవన్

Dhruv Vikram: రమేష్ వర్మతో ద్విభాషా యాక్షన్ చిత్రంగా ధ్రువ్ విక్రమ్ షూట్

Trivikram Srinivas: ఆదర్శ కుటుంబం – AK47 టీజర్ వచ్చేసింది

తర్వాతి కథనం
Show comments