కొత్తపల్లి బాణాసంచా పేలుడు బాధితులను పరామర్శించిన చంద్రబాబు!
తూర్పుగోదావరి జిల్లా యు.కొత్తపల్లి మండలం వాకతిప్ప బాణాసంచా పేలుడు ఘటనలో మరణించిన వారి, బాధిత కుటుంబాలను ముఖ్యమత్రి చంద్రబాబు మంగళవారం పరామర్శించారు. గన్నవరం నుంచి రాజమండ్రి విమానాశ్రయం చేరుకున్న సీఎం... అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో కాకినాడకు వెళ్లారు.
ముందుగా బాధిత కుటుంబాలతో మాట్లాడి ప్రభుత్వం తరపున సాయం చేస్తామని బాబు చెప్పారు. అనంతరం కాకినాడ జీజీహెచ్ మార్చురీ వద్ద మృతదేహాలను పరిశీలించారు. మరోవైపు బాణాసంచా ఘటనలో మంగళవారం ఉదయానికి 16కు చేరింది. మరో ముగ్గురు స్థానిక అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.