1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 8 సెప్టెంబరు 2023 (10:21 IST)

బాలుడి కడుపులో 50 అయస్కాంత గోళీలు..

operation
బాలుడి కడుపులో అయస్కాంత గోళీలను గుర్తించారు వైద్యులు. ఆపై ఆపరేషన్ ద్వారా వాటిని తొలగించారు. వివరాల్లోకి వెళితే.. తెలంగాణ రాష్ట్రం, కమ్మం ప్రాంతానికి చెందిన కార్తీక్, దుర్గా దంపతుల కుమారుడు నెగన్ ఆర్య(వయసు 7). 
 
అతనికి కొన్ని రోజుల ముందు, తీవ్ర కడుపు నొప్పి ఏర్పడింది.  వెంటనే ఆ బాలుడిని తల్లిదండ్రులు విజయవాడలో పిల్లల ఆసుపత్రిలో చేరారు. అక్కడ వైద్యులు అతనికి స్కాన్ చేసి చూడటంతో షాకయ్యారు. 
 
కడుపులో అయస్కాంత గోళీలు వున్నట్లు గుర్తించారు. తల్లిదండ్రుల ఈ విషయం గురించి అడిగినప్పుడు అయస్కాంత గోళీలతో ఆడుకుంటాడని చెప్పారు. సి.ఆర్మ్ ఎక్స్రే అనే టెక్నాలజీతో ఆధునిక శస్త్ర చికిత్స నిర్వహించబడింది.
 
చిన్నపేగు ప్రాంతంలో ఒకటి కాదు రెండు కాదు 50 అయస్కాంత గోళీలను వైద్యులు వెలికితీశారు. ఆ తరువాత కొన్ని గంటల పాటు ఐ.సి.యులో పర్యవేక్షణలో ఉంచారు. ప్రస్తుతం ఆర్య పూర్తిగా కోలుకున్నట్లు డాక్టర్లు తెలిపారు.