సంబంధిత వార్తలు
- రైలులో మహిళ పర్సను చోరీ చేసిన దొంగ... పట్టుకుని కిటికీకి వేలడాదీసిన ప్రయాణికులు
- ప్రియురాలు మోసం చేసిందనీ.. వంద మంది మహిళలను బ్లాక్మెయిల్ చేసిన ఘనుడు...
- భార్యను హత్య చేసి లొంగిపోయేందుకు ఠాణాకు వెళుతూ...
- మలయాళ నటి అపర్ణ నాయర్ ఉరేసుకుని ఆత్మహత్య
- టాలీవుడ్ను కుదిపేస్తున్న రేవ్ పార్టీలు.. డ్రగ్స్ పార్టీలో సినీ ఫైనాన్షియర్ అరెస్టు
నెల్లూరు రైల్వే స్టేషన్కు బాంబు బెదిరింపు... పోలీసుల అప్రమత్తం
జిల్లా కేంద్రమైన నెల్లూరులోని రైల్వే స్టేషన్కు బాంబు బెదిరింపు వచ్చింది. గుర్తు తెలియని వ్యక్తి ఎవరో ఫోన్ చేసి బాంబు పెట్టినట్టు హెచ్చరించాడు. దీంతో రైల్వే స్టేషన్లో ఒక్కసారిగా కలకలం రేగింది. ఒకటో నంబరు ఫ్లాట్ఫాంపై బాంబు పెట్టామని, అది మరికొద్దిసేపట్లో పేలుతుదంటూ 112 నెంబరుకు ఫోన్ చేసి హెచ్చరించాడు. ఈ విషయాన్ని రైల్వేసిబ్బంది ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాడు.
దీంతో అప్రమత్తమైన పోలీసులు... బాంబు తనిఖీ బృందాలు, పోలీసు జాగిలాలతో స్టేషన్ను జల్లెడ పట్టారు. ప్రయాణికులను రైల్వే స్టేషన్ నుంచి దూరంగా పంపించి పార్శిల్ కేంద్రం, బ్యాగులను తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో ఎక్కడా బాంబు పెట్టినట్టు ఆనవాళ్ళు లేకపోవడంతో అకతాయి పనిగా తేల్చారు. దీంతో ప్రయాణికులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. అకతాయి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
