Jagan: రాజకీయ హింసను ఇంజనీరింగ్ చేస్తోన్న చంద్రబాబు.. జగన్ ఫైర్
కడప జిల్లాలోని పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలో జరుగుతున్న జెడ్పీటీసీ ఉప ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజకీయ హింసకు పాల్పడుతున్నారని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరోపించారు. కడప జిల్లా నల్గొండవారిపల్లి గ్రామంలో ప్రచారం జరుగుతున్న సమయంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్ కాన్వాయ్పై టీడీపీ కార్యకర్తలు రాళ్లు రువ్వడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక సందర్భంగా నాయుడు అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నాడు. హింసను ఇంజనీరింగ్ చేస్తున్నాడు. ఉప ఎన్నికలో గెలవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు" అని జగన్మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. రెండు సంవత్సరాల క్రితం జెడ్పీటీసీ సభ్యుడు సి మహేశ్వర్ రెడ్డి మరణించిన తర్వాత ఉప ఎన్నిక అవసరమైంది. ఆయన పోటీ లేకుండా ఆ స్థానాన్ని దక్కించుకున్నారు.
నల్లగొండవారిపల్లి సమీపంలో టిడిపి కార్యకర్తలు రమేష్ యాదవ్, వేముల మండల పార్టీ ఇన్ఛార్జ్ వి రామలింగారెడ్డిపై దాడి చేశారని, వారిని గాయపరిచారని, వారి వాహనాన్ని ధ్వంసం చేశారని జగన్ ఆరోపించారు. అయితే పదేపదే ఫిర్యాదులు వచ్చినప్పటికీ కామ్గా వున్నారు. 100 మందికి పైగా వైయస్ఆర్సిపి కార్యకర్తలను బంధించారని, టిడిపి మద్దతుదారులు స్వేచ్ఛగా తిరుగుతున్నారని, పోలీసులు నాయుడు రాజకీయ ఆదేశాల ప్రకారం పనిచేస్తున్నారని మాజీ ముఖ్యమంత్రి ఆరోపించారు.
అధికార టీడీపీ చట్టాన్ని దుర్వినియోగం చేస్తోందని, ఇది ప్రజాస్వామ్యానికి, న్యాయానికి ముప్పుగా అభివర్ణించారు. రెండు రోజులుగా అనేక దాడులు జరిగినప్పటికీ, ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదని, తల గాయాల నుండి రక్తస్రావం అవుతున్న వారికి కూడా రక్షణ నిరాకరించబడినప్పుడు న్యాయం ఎలా గెలుస్తుందని జగన్ అన్నారు.
మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలు (MPTC), జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలు (ZPTC), గ్రామ పంచాయతీలకు ఆగస్టు 10- 12 తేదీల్లో ఎన్నికలు జరగనున్నాయి.