1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 27 మార్చి 2021 (16:44 IST)

హోలీ వేడుకలకు ఆంధ్రప్రదేశ్ రాజ్ భవన్ దూరం

కరోనా కేసుల సంఖ్య పెరగుతున్న నేపథ్యంలో ఈ సంవత్సరం విజయవాడ ఎపి రాజ్ భవన్‌లో హోలీ వేడుకలు నిర్వహించరాదని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వ భూషణ్ హరిచందన్ నిర్ణయించినట్లు గవర్నర్ వారి కార్యదర్శి ముకేష్ కుమార్ మీనా  తెలిపారు. 

రాష్ట్ర ప్రజలందరూ ఇంట్లో ఉండి హోలీ పండుగను జరుపుకోవాలని గవర్నర్ హరిచందన్ ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.  సామాజిక దూరాన్ని కొనసాగించడం, ముసుగు ధరించడం, శానిటైజర్ లేదా సబ్బు ఉపయోగించి తరచుగా చేతులు కడుక్కోవడం వంటి అంశాలను కొనసాగించటం ద్వారా అప్రమత్తంగా ఉండాలన్నారు.

కోవిడ్ వ్యాక్సిన్ సురక్షితంగా ఉన్నందున అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ టీకాలు వేయుంచు కావాలని  గవర్నర్ విజ్ఞప్తి చేశారు. ఇది వైరస్ సంక్రమణ గొలుసును విచ్ఛిన్నం చేయడానికి సహాయ పడుతుందన్నారు.