1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 15 డిశెంబరు 2022 (11:32 IST)

చిన్నారి అల్లరి చేస్తుందనీ.. అగ్గిపుల్లతో ముఖంపై కాల్చిన ఆయా

match stick
విశాఖపట్టణంలోని ఓ అంగన్ వాడీ కేంద్రంలో పని చేసే ఓ ఆయా చేయరాని పని చేసింది. అంగన్ వాడీ కేంద్రంలో చదువుకునేందుకు వచ్చే చిన్నారుల ఆలనాపాలనా చూడాల్సిన ఆయా.. కిరాతకంగా ప్రవర్తించింది. పొద్దస్తమానం ఏడుస్తున్న ఓ చిన్నారి ఏడుపు మానిపించేందుకు అగ్గిపుల్లను వెలిగించి బుగ్గపై కాల్చి చురకలు అంటించింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
విశాఖపట్టణం సీతంపేట పరిధిలోని రాజేంద్రనగర్‌లోని కనకమ్మవారి వీధిలో ఓ అంగన్‌వాడీ కేంద్రం ఉంది. ఇక్కడ పలువురు చిన్నారులకు ఆటపాటలు నేర్పుతుంటారు. ఆ సమయంలో ఓ చిన్నారి అల్లరి చేస్తుండటంతో రేష్మాకు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఆ వెంటనే అగ్గిపుల్ల వెలిగించి చిన్నారి ముఖంపై చురకలు పెట్టింది. ఈ బాధ భరించలేని ఆ చిన్నారి ఏడుస్తూ కేకలు వేయసాగింది. అయినప్పటికీ ఆయాఆ చిన్నారిని వదిలిపెట్టలేదు. ఆ తర్వాత ఇంటికి వెళ్లిన చిన్నారి ముఖంపై ఉన్న గాయాలను చూసిన తల్లి ఆరా తీయగా, అసలు విషయం వెలుగులోకి వచ్చింది. 
 
అంగన్‌వాడీ కేంద్రం నిర్వహిస్తున్న భవనంపైనే సీడీపీవో కార్యాలయం ఉండటం గమనార్హం. ఈ ఘటనపై స్పందించిన సీడీపీవో కార్యాలయ సూపర్‌వైజర్ స్పందించారు. బాధిత బాలిక వద్ద విచారణ జరుపుతున్నారు. నివేదిక తర్వాత తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.