గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 1 డిశెంబరు 2020 (20:35 IST)

మేం కట్టిన ఇళ్లకు వైకాపా స్టిక్కర్లేసారు: బాబు, మీకు నరకంలో కూడా చోటు దక్కదు: జగన్

ఏపీ అసెంబ్లీ సమావేశాలు మంగళవారం నాడు వాడివేడిగా జరిగాయి. గ్రామీణ ప్రాంతాల్లో పేదల ఇళ్లకు డబ్బులు ఇవ్వకుండా వైకాపా ప్రభుత్వం హింసిస్తోందనీ, పైగా తమ హయాంలో నిర్మించిన ఇళ్లకు వైకాపా స్టిక్కర్లు వేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు.
 
పేదలకు ఇళ్ల పంపిణీ చేసిన స్థలాలను చూస్తుంటే బాధేస్తుందన్నారు. వారికి అసైన్డ్ భూములు, ఆట స్థలాలు, శ్మశాన భూములు కేటాయిస్తున్నారనీ, అలాంటి భూములు ఇచ్చేందుకు ఈ ప్రభుత్వానికి మనసెలా వస్తుందో అర్థం కావడంలేదన్నారు. ఇళ్ల స్థలాల వ్యవహారంలో మొత్తం 4 వేల కోట్ల రూపాయల భారీ అవినీతి జరిగిందని ఆరోపించారు.
 
అంతకుముందు అసెంబ్లీలో పేదల ఇళ్ల స్థలాల వ్యవహారంపై ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ... చంద్రబాబు నాయుడు ఏం మనిషో తనకు అర్థం కావడంలేదన్నారు. అన్నీ అబద్ధాలు చెపుతున్నారనీ, తాము పేదలకు పూర్తిస్థాయిలో న్యాయం చేస్తుంటే, అది మాట్లాడకుండూ ఏదేదో మాట్లాడుతున్నారని అన్నారు. నోట్లో నుంచి ప్రతిదీ అబద్దం చెపుతున్న చంద్రబాబు నాయుడుకి నరకంలో కూడా చోటు దక్కదని విమర్శించారు.