సంబంధిత వార్తలు
- పోలవరాన్ని జగన్ పూర్తి చేస్తారు: మంత్రి అనిల్
- హరికృష్ణ శవాన్ని పక్కనబెట్టి కేసీఆర్తో పొత్తులపై చర్చించలేదా?: బాబుపై జగన్ ఫైర్
- నా అనుభవమంత లేదు నీ వయస్సు.. విర్రవీగడం కరెక్టు కాదు : జగన్కు బాబు కౌంటర్
- కాళేశ్వరం కడుతుంటే చంద్రబాబు గాడిదలు కాశారా? జగన్ ప్రశ్న
- అసెంబ్లీ బిల్లులపై కసరత్తు... సర్కారు ఉద్దేశాలు కనిపించాలన్న సీఎం
బడ్జెట్కు ఏపీ కేబినెట్ ఆమోద ముద్ర
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం శుక్రవారం ఉదయం సమావేశమైంది. ఈ సందర్భంగా 2019-20 బడ్జెట్కు మంత్రిమండలి ఆమోదముద్ర వేసింది.
రూ.2లక్షల 27వేల 984 వందల 99 కోట్ల బడ్జెట్కు కేబినెట్ లాంఛనంగా ఆమోదం తెలిపింది. కాగా ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ శుక్రవారం ఉదయం 11 గంటలకు అసెంబ్లీలో తొలిసారిగా రాష్ట్ర వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఇదే సమయానికి శాసన మండలిలో రెవెన్యూ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ బడ్జెట్ సమర్పిస్తారు.
వ్యవసాయ బడ్జెట్ను పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అసెంబ్లీలో, మంత్రి మోపిదేవి వెంకటరమణ శాసన మండలిలో ప్రవేశపెట్టనున్నారు
